Don't Miss!
- News AP Elections: ముగిసిన నామినేషన్ల పర్వం- జగన్, బాబు, పవన్ కు పోటీ ఇలా..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆర్య-2 రిలీజ్ కి రామ్ చరణ్ అడ్డం?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఆర్య-2 చిత్రం నవంబర్ పదకొండున గానీ పదమూడన కానీ రిలీజయ్యే అవకాశముందని సమచారం. అయితే ఇప్పటికే దాదాపు అంతా పూర్తయిపోయినా ఎందుకీ ఆలస్యం అని అల్లు అర్జున్ అభిమానులలోనే కాక పరిశ్రమ వర్గాలలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ చిత్రం రిలీజ్ ని ఓ స్ట్రాటజీ ప్రకారమే చేస్తున్నట్లు తెలుస్తోంది.రామ్ చరణ్ తేజ హీరోగా చేసిన మగధీర వంద రోజులు పూర్యయ్యేదాకా రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. ఎందుకంటే ఆర్య-2 బయ్యర్స్ లో చాలా మంది మగధీర ని కొనుక్కున్నవారే. దాంతో ఆర్య-2 ముందే రిలీజ్ చేస్తే టెమ్ట్ అయి తమ ధియోటర్స్ నుండి మగధీరను తీసేసే అవకాశం ఉంది. ఆ ప్లేసులో ఆర్య-2 వేసేస్తారు. దాంతో వందరోజుల పండుగకు ఇబ్బంది వస్తుంది. మరో ప్రక్క రామ్ చరణ్ అభిమానులు గొడవలూ చేయవచ్చు. అందులోనూ కొత్తగా కలిపిన సీన్స్ వల్ల మగధీర కలెక్షన్స్ మళ్ళీ పుంజుకున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రిలీజ్ ని వాయిదా వేసారు.