Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మాయీ సినిమాలో నటించనున్న గాయని ఆశాభోస్లే
సినిమాలకు ఆరు దశాబ్దాల పాటు తన గాన మాధుర్యాన్ని అందించారు ఆశా భోస్లే. ఇప్పుడు ఆమెకు 77 ఏళ్లు. ఈ వయస్సులో ఆమె నటనను సవాల్గా తీసుకుంటున్నారు. ఆమె హిందీ సినిమా మాయీలో నటించడానికి అంగీకరించారు. పలు సంగీత వీడియోలను కూడా ఆమె విడుదల చేశారు. ఇప్పుడు ఆమె ఓ సినిమాలో లీడ్ రోల్ చేయబోతోంది. ఈ సినిమాను సుభాష్ దావర్, నితిని శంకర్ నిర్మిస్తున్నారు. ఉన్న ఒక్క కొడుకు వదిలేస్తే, కూతురూ అల్లుడి ఇంటికి వెళ్తే ఓ మహిళ పరిస్థితి ఎలా ఉంటుందనేది సినిమా కథ ఇతివృత్తం. ఈ సినిమాకు కొత్త దర్శకుడు మహేష్ కడియాల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
నటన అనేది తాను ఇంత వరకు చేయని పని అని, తనకు ఏది నచ్చితే అది చేస్తానని తన అభిమానులకు తెలుసునని ఆశా భోస్లే అన్నారు. కథ వినిపించినప్పుడు ఒక తల్లిగా, మనిషిగా తనెంతో కదిలిపోయానని ఆమె అన్నారు. పద్మినీ కొల్హాపురి తన కూతురుగా నటించడం వల్ల కూడా తాను ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు ఆమె తెలిపారు. మాయీ సినిమా షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభమవుతుంది. షూటింగ్ మొత్తం ముంబైలోనే జరుగుతుంది.