Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మనవరాలిని నిలబెట్టాలనే ప్రోత్సాహం
ముంబై : ప్రముఖ నేపథ్య గాయకురాలు ఆషా భోంస్లే తన మనవరాలు జనాయ్(12) కూడా తన మాదిరిగానే నేపథ్య గాయకురాలు కావాలని కలలు కంటున్నారు. ఇప్పటికే ఈ దిశగా ఆమె తన కుమారుడు ఆనంద్ కుమార్తె జనాయ్కి శిక్షణనివ్వటం ఆరంభించారు. గత ఏడాది మాయ్ సినిమాలో తొలిసారిగా ఆమెతో పాడించారు కూడా. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె జనాయ్తో కలిసి అవార్డుల కార్యక్రమంలో వేదిక పంచుకున్నారు.
జీవితంలో తాను కోరుకున్న పాటలు పాడటం, నటన, టీవీ షోలు, స్టేజ్ ప్రదర్శనలు సర్వం సాధించానని, ఇటీవలే ర్యాంప్ మీద కూడా ఫ్యాషన్ షోలో కనిపించానని , ఇప్పుడు మనమరాల్ని నేపథ్య గాయనిగా చూడటమే తరువాయి అని ఆమె చెప్పారు. తను, తన సోదరి లతా మంగేష్కర్లు కలగలిపిన అద్భుతమైన గాత్రం జనాయ్ సొంతమని అన్నారు. గాయనిగా తన కెరీర్ ఆరంభంలో ప్రముఖ గాయనీల నుంచి ఎన్నో సవాళ్లని ఎదుర్కోవటంతో తనదైన శైలిలో పాటలు పాడటం ఆరంభించి ఈ స్థితికి చేరుకున్నానని ఆమె ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు.
''నేను పరిశ్రమలోకి గాయనిగా వచ్చేటప్పటికి చాలా మంది గొప్ప గాయనీగాయకులు ఇక్కడ ఉన్నారు. వారందరిలో నేను భిన్నం అనిపించుకోవడానికి చాలా కష్టపడ్డాను. అలా కొత్తగా చేసిన ప్రయత్నమే 'ఈనా మీనా దీకా..'. ఈ పాట విన్న వాళ్లలో చాలా మంది 'ఏంటి అలా పాడావు' అంటూ విమర్శించారు. కానీ ఆ పాట నాకు ఎంతో మంది అభిమానుల్ని తెచ్చిపెట్టింది'' అంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు ప్రముఖ గాయని ఆశా భోంస్లే.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆశా అనేక విషయాల్ని పంచుకున్నారు. ''పరిశ్రమలో మంచి గీత రచయితలకు కొరత ఏర్పడింది. ఐటెమ్ సాంగ్స్ ఫ్యాషన్ అయిపోయాయి. కొన్ని పాటలు వింటుంటే చిరాకు పుడుతోంది. 'లుంగి డ్యాన్స్', 'మున్నీ బద్నామ్', 'హల్కత్ జవాని' లాంటి పాటల్లో సాహిత్యం మితిమీరిపోతోంది. ఇదే సమయంలో 'జబ్ సే తేరే నైనా' లాంటి పాటలు బాగుంటున్నాయి'' అంటూ నేటి బాలీవుడ్ పాటల గురించి చెప్పుకొచ్చారు
తన మనవరాలు జానై భోంస్లే గురించి చెబుతూ ''గానం, నటన, టీవీ షోలు, స్టేజీ షోలు, ర్యాంప్ వాక్.. ఇలా నా జీవితంలో అన్నీ చేసేశాను. ఇక నా మనవరాలు జానైని గొప్ప గాయనిగా చూడాలన్నదే నా లక్ష్యం. ఆమె గాత్రం చాలా బాగుంటుంది. నా, లత వాయిస్ కలిపినట్లుగా ఉంటుంది. జానైను ఉత్తమ గాయనిగా తీర్చిదిద్దేందుకు నా వంతు ప్రయత్నాలు చేస్తాను'' అని తెలిపారు. జానై గతేడాది 'మాయి' అనే సినిమా ద్వారా గాయనిగా పరిచయమైంది.