Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇంద్రగంటి మోహన్ కృష్ణ కొత్త చిత్రం టైటిల్ ఇదే..
ఈ చిత్రంతో హీరోయిన్ ఈషా పరిచయమవుతోంది. నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "దర్శకుడు చెప్పిన కథలోని నవ్యత, దాని తెరపై చిత్రీకరించే విధానం సరికొత్తగా నడుస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. నాయకా నాయికలు ఉత్తమ స్థాయి ప్రతిభను కనబరుస్తున్నారు. షూటింగ్ ముగింపు దశలో ఉన్న చిత్రాన్ని మే నెలాఖరులోగా విడుదల చేస్తాం'' అని చెప్పారు.
ఇక ఇది ఓ ఉద్వేగభరితమైన రొమాంటిక్ డ్రామా అని దర్శకుడు మోహనకృష్ణ తెలిపారు. "నిజమైన రొమాన్స్, నిజమైన జీవితం, నిజమైన అనుభవాలు, నిజమైన నాటకీయ సన్నివేశాలు, హృదయాన్ని స్పృశించే భావోద్వేగాల సంగమమే ఈ చిత్రం. ప్రేమ, పెళ్లి, సరైన భాగస్వామిని ఎంచుకోవడం ఎలా అనే విషయాలపై ఎన్నో చర్చలు, వాదోపవాదాలు వస్తున్న సమయంలో ఈ కథ తాలుకు బీజం నాలో పుట్టింది'' అని ఆయన చెప్పారు.
రవిబాబు, రావు రమేశ్, ఉప్పలపాటి నారాయణరావు, అవసరాల శ్రీనివాస్, తాగుబోతు రమేశ్, కల్యాణీ మాలిక్, రోహిణి, మధుబాల, ప్రగతి, ఝాన్సీ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, అనంత శ్రీరామ్, సంగీతం: కల్యాణి కోడూరి, ఛాయాగ్రహణం: పి.జి. విందా, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్రెడ్డి వి., కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.