Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తమన్నాను అందుకే తీసుకోలేదు.. విషయం బయటపెట్టిన హీరో
రాజుగారి గది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో షకలక శంకర్, ధన్ రాజ్ కలిసి చేసిన కామెడీకి ప్రేక్షకులు ఎంతగానో పగలబడి నవ్వారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించేసరికి సీక్వెల్పై దృష్టి పెట్టారు.
నాగార్జున, సమంత లాంటి స్టార్స్తో రాజుగారిగది 2 చిత్రాన్ని తీశారు. అయితే ఈ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. మొదటి పార్ట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ రెండో భాగంలో మిస్ అయింది. దీంతో ప్రేక్షకులు కాస్త నిరాశపడ్డారు. అయితే ఇటీవలె మూడో పార్ట్ను కూడా సిద్దం చేశారు.
ఈ మూవీ కూడా విడులకు సిద్దంగా ఉంది. అయితే ఈ మూడో పార్ట్లో మొదటగా తమన్నాను హీరోయిన్గా ఎంచుుకున్నారు. పూజా కార్యక్రమాలకు తమన్నా హాజరైంది. ఏమైందో గానీ అకస్మాత్తుగా తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న హీరో అశ్విన్.. ఈ విషయంపై స్పందించాడు. మొదటగా తమన్నాను హీరోయిన్గా సెలెక్ట్ చేశాము కానీ ఆమె డేట్స్ కుదరక పోవడంతో అవికాను తీసుకున్నట్లు తెలిపాడు. ఆ పాత్రకు అవికా న్యాయం చేసిందన్నాడు.
ఓంకార్ ఎంటర్టైన్మెంట్స్పై ఓంకార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. ఇటీవలె సైరా చిత్రంలో లక్ష్మీ పాత్రకు మంచి ప్రశంసలు అందుకున్న తమన్నా.. తమిళంలో తాజాగా విడుదలైన పెట్రోమ్యాక్స్లోనూ మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది.