Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తమన్నాను అందుకే తీసుకోలేదు.. విషయం బయటపెట్టిన హీరో
రాజుగారి గది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో షకలక శంకర్, ధన్ రాజ్ కలిసి చేసిన కామెడీకి ప్రేక్షకులు ఎంతగానో పగలబడి నవ్వారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించేసరికి సీక్వెల్పై దృష్టి పెట్టారు.
నాగార్జున, సమంత లాంటి స్టార్స్తో రాజుగారిగది 2 చిత్రాన్ని తీశారు. అయితే ఈ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. మొదటి పార్ట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ రెండో భాగంలో మిస్ అయింది. దీంతో ప్రేక్షకులు కాస్త నిరాశపడ్డారు. అయితే ఇటీవలె మూడో పార్ట్ను కూడా సిద్దం చేశారు.
ఈ మూవీ కూడా విడులకు సిద్దంగా ఉంది. అయితే ఈ మూడో పార్ట్లో మొదటగా తమన్నాను హీరోయిన్గా ఎంచుుకున్నారు. పూజా కార్యక్రమాలకు తమన్నా హాజరైంది. ఏమైందో గానీ అకస్మాత్తుగా తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న హీరో అశ్విన్.. ఈ విషయంపై స్పందించాడు. మొదటగా తమన్నాను హీరోయిన్గా సెలెక్ట్ చేశాము కానీ ఆమె డేట్స్ కుదరక పోవడంతో అవికాను తీసుకున్నట్లు తెలిపాడు. ఆ పాత్రకు అవికా న్యాయం చేసిందన్నాడు.
ఓంకార్ ఎంటర్టైన్మెంట్స్పై ఓంకార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. ఇటీవలె సైరా చిత్రంలో లక్ష్మీ పాత్రకు మంచి ప్రశంసలు అందుకున్న తమన్నా.. తమిళంలో తాజాగా విడుదలైన పెట్రోమ్యాక్స్లోనూ మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది.