Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తమన్నాను అందుకే తీసుకోలేదు.. విషయం బయటపెట్టిన హీరో
రాజుగారి గది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో షకలక శంకర్, ధన్ రాజ్ కలిసి చేసిన కామెడీకి ప్రేక్షకులు ఎంతగానో పగలబడి నవ్వారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించేసరికి సీక్వెల్పై దృష్టి పెట్టారు.
నాగార్జున, సమంత లాంటి స్టార్స్తో రాజుగారిగది 2 చిత్రాన్ని తీశారు. అయితే ఈ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. మొదటి పార్ట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ రెండో భాగంలో మిస్ అయింది. దీంతో ప్రేక్షకులు కాస్త నిరాశపడ్డారు. అయితే ఇటీవలె మూడో పార్ట్ను కూడా సిద్దం చేశారు.
ఈ మూవీ కూడా విడులకు సిద్దంగా ఉంది. అయితే ఈ మూడో పార్ట్లో మొదటగా తమన్నాను హీరోయిన్గా ఎంచుుకున్నారు. పూజా కార్యక్రమాలకు తమన్నా హాజరైంది. ఏమైందో గానీ అకస్మాత్తుగా తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న హీరో అశ్విన్.. ఈ విషయంపై స్పందించాడు. మొదటగా తమన్నాను హీరోయిన్గా సెలెక్ట్ చేశాము కానీ ఆమె డేట్స్ కుదరక పోవడంతో అవికాను తీసుకున్నట్లు తెలిపాడు. ఆ పాత్రకు అవికా న్యాయం చేసిందన్నాడు.
ఓంకార్ ఎంటర్టైన్మెంట్స్పై ఓంకార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. ఇటీవలె సైరా చిత్రంలో లక్ష్మీ పాత్రకు మంచి ప్రశంసలు అందుకున్న తమన్నా.. తమిళంలో తాజాగా విడుదలైన పెట్రోమ్యాక్స్లోనూ మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది.