Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దర్శకురాలుగా అశ్వనీదత్ కుమార్తె
హైదరాబాద్: నేను యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ చేశా. ప్రముఖ యాడ్ ఫిలిమ్ మేకర్ 'విక్కీ డోనర్' ఫేమ్ సుజిత్ సర్కార్ దగ్గర రెండున్నరేళ్లు దర్శకత్వశాఖలో పనిచేశాను. నేను కూడా కొన్ని యాడ్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ డెరైక్ట్ చేశా. ఎప్పటికైనా ఓ సినిమా డెరైక్ట్ చేస్తాను. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు నిర్మించే ప్రణాళికలు ఉన్నాయి అంటున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రింయాక దత్.
వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ రెండో కుమార్తె అయిన ప్రియాంక 'త్రీ ఏంజిల్స్' పతాకంపై బాణం, ఓం శాంతి చిత్రాలు నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న 'సారొచ్చారు' ఆమె మూడో చిత్రం. ఈ సినిమా గురించి, తన కెరీర్ ప్రణాళికల గురించి ప్రియాంక మీడియాతో మాట్లాడారు. అలాగే నిర్మాతగా నాకు మా నాన్నగారే ఆదర్శం. ఆయన స్థాయిలో కాకపోయినా, ఆయన మార్గంలో నడుస్తూ వైవిధ్యభరిత చిత్రాలు నిర్మిస్తా అని అన్నారు ప్రియాంకదత్.
ఇక మొదట నుంచీ 'సారొచ్చారు' చిత్రంలో గెస్ట్ గా నారా రోహిత్ చేస్తున్నారని, ఆ తర్వాత అదంతా రూమరే అని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమె క్లారిపై చేసారు. ఆమె మాట్లాడుతూ... సారొచ్చారు చిత్రాన్ని మొదట వైజయంతీ బ్యానర్పైనే చేయాలి. నాకు ఈ కథ బాగా నచ్చి 'త్రీ ఏంజిల్స్'లో చేసుకుంటానని నాన్నగారిని అడిగిమరీ తీసుకున్న రవితేజ ఇప్పటివరకూ తీసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందులో రవితేజ ఫుట్బాల్ కోచ్గా కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ చాలా కొత్తగా ఉంటుంది. నారా రోహిత్ ఇందులో గెస్ట్గా కనిపిస్తారు అన్నారు.
అలాగే 'ఇంద్ర'ను భారీస్థాయిలో హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉందని ఆమె తెలిపారు. చిరంజీవి నటించిన 'ఇంద్ర' చిత్రం భారీ విజయం సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించిన ఈ చిత్రాన్ని మెగా దర్శకుడు బి.గోపాల్ డెైరెక్ట్ చేయగా... మెగా చిత్రాల నిర్మాత అశ్వినీదత్ భారీ వ్యయంతో దీన్ని నిర్మించారు. పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం తాజాగా బాలీవుడ్లో రీమేక్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రం హిందీ రీమేక్ రెట్స్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ విషయమై నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ మాట్లాడుతూ...ఇంద్ర రీమేక్ రైట్స్ కోసం చాలా ఆపర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పటివరకూ ఎవరకీ రైట్స్ ఇవ్వలేదు. ఈ సినిమాని మా ప్రొడక్షన్ లోనే హిందీలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు. అయితే ఎప్పుడు ఈ సినిమా మొదలవుతుంది... ఎవరితో చేస్తారు వంటి విషయాలు ఆమె మీడియాకు తెలియచేయలేదు. త్వరలో ఈ విషయమై ప్రకటన వచ్చే అవకాసముందని సమాచారం. అయితే ప్రియాంక దర్శకత్వం చేయవచ్చు అనే టాక్ కూడా వినపడుతోంది.