Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అశ్వనీదత్ ఆ దర్శకుడుకి చేసిందే హాట్ టాపిక్
మెగా నిర్మాత అశ్వనీదత్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు. ఆయనలోని మానవతావాదిని ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ పొగుతున్నారు. విషయంలో ఏమిటంటే...ఆయన గతంలో నాగార్జున, సౌందర్య జంటగా తిరుపతిస్వామి దర్శకత్వంలో 'ఆజాద్'చిత్రాన్ని నిర్మించారు.విభిన్న కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం విజయం సాధించింది.ఈ సినిమా తరువాత 'సెల్యూట్' చిత్రాన్ని రూపొందించి, ఆ సినిమా విడుదల కాకుండానే తిరుపతిస్వామి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే తెలుగులో హిట్టైన చిత్రాలను తమిళంలో రీమేక్ చేసే విజయ్కు 'ఆజాద్' చిత్రం నచ్చడంతో ఆ సినిమా హక్కులు తీసుకుని రీమేక్ చేసారు. ఆ సినిమానే 'వేలాయుధం'.
జెనీలియా, హన్సిక హీరోయిన్లు గా మొన్న దీపావళికి తమిళనాట విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఎడిటర్ మోహన్ కుమారుడు రాజా దర్శకత్వం వహించారు. ఇక అస్సలు విషయం ఏమిటంటే... ఈ సినిమా రీమేక్ హక్కులు అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరుపతి స్వామి కుటుంబసభ్యులు ఎక్కడున్నారో కనుక్కొని వారికి పంపించారు అశ్వనీదత్. దాంతో సినీ ప్రముఖలంతా అశ్వనీదత్ ని అబినందించారు.ఇక శక్తి సినిమా డిజాస్టర్ కావటంతో అశ్వనీదత్ మరో సినిమా ఇంకా ప్రారంభించలేదు. త్వరలోనే ఆయన మరో సినిమా ఓ స్టార్ హీరోతో ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి.