twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అశ్వనీదత్‌ ఆ దర్శకుడుకి చేసిందే హాట్ టాపిక్

    By Srikanya
    |

    మెగా నిర్మాత అశ్వనీదత్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు. ఆయనలోని మానవతావాదిని ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ పొగుతున్నారు. విషయంలో ఏమిటంటే...ఆయన గతంలో నాగార్జున, సౌందర్య జంటగా తిరుపతిస్వామి దర్శకత్వంలో 'ఆజాద్'చిత్రాన్ని నిర్మించారు.విభిన్న కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం విజయం సాధించింది.ఈ సినిమా తరువాత 'సెల్యూట్' చిత్రాన్ని రూపొందించి, ఆ సినిమా విడుదల కాకుండానే తిరుపతిస్వామి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే తెలుగులో హిట్టైన చిత్రాలను తమిళంలో రీమేక్ చేసే విజయ్‌కు 'ఆజాద్' చిత్రం నచ్చడంతో ఆ సినిమా హక్కులు తీసుకుని రీమేక్ చేసారు. ఆ సినిమానే 'వేలాయుధం'.

    జెనీలియా, హన్సిక హీరోయిన్లు గా మొన్న దీపావళికి తమిళనాట విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఎడిటర్ మోహన్ కుమారుడు రాజా దర్శకత్వం వహించారు. ఇక అస్సలు విషయం ఏమిటంటే... ఈ సినిమా రీమేక్ హక్కులు అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరుపతి స్వామి కుటుంబసభ్యులు ఎక్కడున్నారో కనుక్కొని వారికి పంపించారు అశ్వనీదత్. దాంతో సినీ ప్రముఖలంతా అశ్వనీదత్ ని అబినందించారు.ఇక శక్తి సినిమా డిజాస్టర్ కావటంతో అశ్వనీదత్ మరో సినిమా ఇంకా ప్రారంభించలేదు. త్వరలోనే ఆయన మరో సినిమా ఓ స్టార్ హీరోతో ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి.

    English summary
    Ashwini Dutt asked his men to search for the family members of Tirupati Swamy and handed over the money he bagged through remake rights of Azad to his family members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X