Don't Miss!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రికార్ట్ రేట్లకి చేరుకోవడంతోనే జూ ఎన్టీఆర్ ‘శక్తి’ సీక్వెల్ రేంజ్ కి వెళ్తోంది..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో త్వరలో విడుదలకి సిద్దమవుతున్న జూ ఎన్టీఆర్ చిత్రం శక్తిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని ఏరియాల్లో రికార్డు రేట్లకి అమ్ముడైన ఈ చిత్రం ఖచ్చితంగా అంచనాలకి తగ్గట్టే సూపర్ హిట్ అవుతుందని అశ్వనీదత్ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని ఆయన అంటున్నారంటేనే శక్తిపై ఆయనకి ఏర్సడిన నమ్మకం ఏమిటనేది అర్థమవుతోంది. ఆయన అంతటితో ఆగిపోలేదు. ఈ చిత్రానికి తెలుగులో సీక్వెల్ తీసే ఆలోచన కూడా ఉన్నట్టు అశ్వనీదత్ పేర్కొన్నారు.
'శక్తి" ఫాంటసీ కథాంశమే అయినా మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయని, మెహర్ రమేష్ అద్భుతంగా తెరకెక్కించాడని అశ్వనీదత్ చెప్పారు. ఎన్టీఆర్ పూర్తి శక్తి సామర్థ్యాలు తెలియజేసేలా ఈ చిత్రముంటుందని, ఇలియానా ఫెర్ఫామెన్స్ అద్బుతంగా ఉన్నాయని ఆయన అన్నారు. తెలుగులో వచ్చిన సినిమాల్లో టాప్ 20లో నిలిచే చిత్రమవుతుందని అశ్వనీదత్ ధీమాతో ఉన్నారు.
అంతే కాకుండా మరో ప్రక్క మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి"సీక్వెల్ కు స్క్రిప్ట్ ని రెడీ చేసే పని నిమగ్నం అయ్యారని సమాచరం. కాగా ఈ చిత్రం ఒరిజినల్ లో చిరంజీవి 'రాజు" పాత్రలో రామ్ చరణ్ తేజ ను నటింపచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.