మల్టీప్లెక్స్ ఓపెన్: సమంత, నితిన్, వినాయక్ సందడి (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలో మల్టీ ప్లెక్సు థియేటర్ల సంస్కృతి పెరిగి పోతున్న సంగతి తెలిసిందే. తాజాగా కూకట్పల్లిలో మరో మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభమైంది. ఈ మల్టీ ప్లెక్స్ థియేటర్ ప్రారంభోత్సవంలో టాలీవుడ్ హీరోయిన్ సమంత, యంగ్ హీరో నితిన్, ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయని, ఈ తరం ప్రేక్షకులు కోరుకునే అన్ని సౌకర్యాలు ఉంటాయని, మల్టీ ప్లెక్స్ అయినప్పటికీ మధ్య తరగతి ప్రేక్షకులకు అందుబాటులో ధరలు ఉంటాయని సురేష్ బాబు వెల్లడించారు.
ఏసియస్ సినిమాస్...ఓపెనింగుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

సమంత
కూకట్ పల్లిలో కొత్తగా ఏర్పాటైన ఏసియస్ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ఓపెన్ చేస్తున్న హీరోయిన్ సమంత.

వావ్ సమంత...
సమంతను చూసేందుకు పలువురు అభిమానులు పోటీ పడ్డారు. థియేటర్ యాజమాన్యం పుష్పగుచ్చం ఇచ్చి ఆమెను ఆహ్వానించారు.

నితిన్, వినాయక్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కూడా ఈ ఓపెనింగు కార్యక్రమానికి హాజరయ్యారు.

సమంత లుక్ సూపర్
ఏసియస్ సినిమాస్ ప్రారంభోత్సవం సందర్బంగా సమంత తన హాట్ లుక్తో అందరినీ ఆకట్టుకుంది.

మధ్య తరగతికి అందుబాటులో...
ఏసియస్ సినిమాస్లో టికెట్ ధరలు మధ్య తరగతి వారికి అందుబాటులోనే ఉంటాయని సురేష్ బాబు తెలిపారు. ఈ థియేటర్లో టిక్కెట్ ధర రూ. 125గా నిర్ణయించినట్లు సమాచారం.

మీడియాతో సమంత
ఏసియస్ సినిమాస్ వారు అందిస్తున్న సౌకర్యాల గురించి మీడియాకు వెల్లడిస్తున్న సమంత.

ఏసియస్ సినిమాస్ 1
కూకట్ పల్లిలో కొత్తగా ఏర్పాటైన ఏసియస్ సినిమాస్ థియేటర్ లోపలి భాగం....

ఏసియస్ సినిమాస్ 2
కూకట్ పల్లిలో కొత్తగా ఏర్పాటైన ఏసియస్ సినిమాస్ థియేటర్ లోపలి భాగం....


Click it and Unblock the Notifications











