Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రజల జీవితాన్ని మార్చేశాడు: వాజ్పేయి మరణంపై రాజమౌళి, ఎన్టీఆర్, రానా ఇంకా స్టార్స్!
భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గురువారం సాయంత్రం ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. దేశ అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు, చారిత్రక నిర్ణయాలు తీసుకున్న గొప్ప ప్రధాన మంత్రుల్లో ఒకరిగా కీర్తిగడించిన ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాజమౌళి, ఎన్టీఆర్, రానా, మంచు విష్ణు తదితరులు వాజ్పేయిని గొప్ప రాజకీయవేత్తగా, దేశానికి అణుశక్తి కవచం ఏర్పరచడంలో కృషి చేసిన వ్యక్తిగా, ఇకా ఆయన చేసిన గొప్ప పనులను కీర్తిస్తూ ట్వీట్ చేశారు.
|
రాజమౌళి
రాజకీయలకు గౌరవం తెచ్చిన వ్యక్తి ఆయన. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చింది... అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
|
ఎన్టీఆర్ సెల్యూట్
మన దేశాన్ని లీడ్ చేసిన గ్రేట్ లీడర్స్లో ఒకరైన వాజ్ పేయి గారికి సెల్యూట్. గొప్ప రాజకీయవేత్త, గొప్ప జాతీయ వాది, గొప్ప విజన్ ఉన్న నాయకుడు అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.
|
రానా ట్వీట్
ఈ రోజు మనం గొప్ప రాజనీతజ్ఞుడు, రచయిత, వక్తను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను... అని రానా ట్వీట్ చేశారు.
|
మంచు విష్ణు
నా ఫేవరెట్ పొలిటీషియన్ వాజ్ పేయి. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన ఎన్నో మంచి పనుల రూపంలో ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారు అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
|
గౌతమి
వాజ్ పేయి మరణంపై ప్రముఖ నటి గౌతమి స్పందిస్తూ... ఆయన దేశానికి చేసిన సేవ ఎంతో మందికి స్పూర్తి దాయకం అన్నారు.
|
అల్లరి నరేష్
వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటూ... అల్లరి నరేష్ ట్వీట్.
|
ఈషారెబ్బ
వాజ్ పేయిని తలుచుకుంటూ హీరోయిన్ ఈషా రెబ్బ ట్వీట్. ఆయన్ను గొప్ప రాజకీయ వేత్తగా పేర్కొంటూ ఓ వీడియోను పోస్టు చేశారు.
|
సురేష్ ప్రొడక్షన్
అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి ఆకస్మిక మరణం కారణంగా ఇవాళ సాయంత్రం జరగాల్సిన మా దర్శకుడితో మీ సంభాషణ ని ఆపివేయడం జరుగుతుంది... భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ #AtalBihariVajpayee గారి మరణానికి చింతిస్తూ... ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము... అని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పేర్కొంది.