Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
మహేష్ 'అతడు' శాటిలైట్ రైట్స్ కొత్త రికార్డు
మహేష్ బాబు చిత్రం అతడు మా టీవీ లో రెగ్యులర్ గా వేస్తూంటారు. ఈ చిత్రం రైట్స్ వారి వద్ద ఉన్నాయి. ఆరేళ్ళ అనంతరం ఈ రైట్స్ పిరియడ్ అయ్యిపోయింది. అయితే ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తం ఇచ్చి రెన్యువల్ చేయించుకున్నట్లు సమాచారం. ఇది తెలుగు టీవీ చరిత్రలో రికార్డు అంటున్నారు. ఎందుకంటే ఓ సినిమా రైట్స్ పీరియడ్ అయ్యిపోయిన తర్వాత అదే ఛానెల్ వారు దాన్ని రిపీట్ చెయ్యటానికి ఇష్టపడదు. కానీ అతడు చిత్రం వేసేటప్పుడు వచ్చే యాడ్ రెవెన్యూ చూసి మా టీవి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. ఇక మాటీవికి తగ్గట్లే అతడు చిత్రం కూడా ఫ్యామిలీలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కుటుంబం అంతా కూర్చుని చూసేటట్లు కుటుంబ భావోద్వేగాలు,యాక్షన్,కామిడీ సినిమాను అన్నివర్గాలకు నచ్చే విధంగా ఉండటం ప్లస్ అయ్యింది.
ఇక అతడు సినిమా రిలీజైనప్పుడు ఈ చిత్రం చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువైందని,అంతరేటుకు బిజినెస్ లేదని అప్పట్లో నిర్మాత మురళీ మోహన్ కంప్లైట్ చేసి ఇక సినిమాలు తీయనని ప్రకటించారు. ఆయన అన్నట్లే ఆ తరవాత సినిమాలు కూడా తీయలేదు. అయితే ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంసమైంది. ఇక ప్రస్తుతం మహేష్ తన బిజినెస్ మ్యాన్ చిత్రం హడావిడిలో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మహేష్ దూకుడు చిత్రం కూడా మంచి రేటుకే శాటిలైట్ రైట్స్ అమ్ముడయినట్లు చెప్తున్నారు.