Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ 'అతడు' శాటిలైట్ రైట్స్ కొత్త రికార్డు
మహేష్ బాబు చిత్రం అతడు మా టీవీ లో రెగ్యులర్ గా వేస్తూంటారు. ఈ చిత్రం రైట్స్ వారి వద్ద ఉన్నాయి. ఆరేళ్ళ అనంతరం ఈ రైట్స్ పిరియడ్ అయ్యిపోయింది. అయితే ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తం ఇచ్చి రెన్యువల్ చేయించుకున్నట్లు సమాచారం. ఇది తెలుగు టీవీ చరిత్రలో రికార్డు అంటున్నారు. ఎందుకంటే ఓ సినిమా రైట్స్ పీరియడ్ అయ్యిపోయిన తర్వాత అదే ఛానెల్ వారు దాన్ని రిపీట్ చెయ్యటానికి ఇష్టపడదు. కానీ అతడు చిత్రం వేసేటప్పుడు వచ్చే యాడ్ రెవెన్యూ చూసి మా టీవి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. ఇక మాటీవికి తగ్గట్లే అతడు చిత్రం కూడా ఫ్యామిలీలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కుటుంబం అంతా కూర్చుని చూసేటట్లు కుటుంబ భావోద్వేగాలు,యాక్షన్,కామిడీ సినిమాను అన్నివర్గాలకు నచ్చే విధంగా ఉండటం ప్లస్ అయ్యింది.
ఇక అతడు సినిమా రిలీజైనప్పుడు ఈ చిత్రం చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువైందని,అంతరేటుకు బిజినెస్ లేదని అప్పట్లో నిర్మాత మురళీ మోహన్ కంప్లైట్ చేసి ఇక సినిమాలు తీయనని ప్రకటించారు. ఆయన అన్నట్లే ఆ తరవాత సినిమాలు కూడా తీయలేదు. అయితే ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంసమైంది. ఇక ప్రస్తుతం మహేష్ తన బిజినెస్ మ్యాన్ చిత్రం హడావిడిలో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మహేష్ దూకుడు చిత్రం కూడా మంచి రేటుకే శాటిలైట్ రైట్స్ అమ్ముడయినట్లు చెప్తున్నారు.