Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
అఖిల్పై పవన్ సినిమా ప్రభావం.. లెక్కలేనన్ని సార్లు చూశాడట, మిస్టర్ మజ్నులో ఆ ఛాయలు
అక్కినేని వారసుడు అఖిల్ తన మూడవ చిత్రంతో సిద్ధం అవుతున్నాడు. తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శత్వంలో అఖిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎన్నార్ జయంతి సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లవర్ బాయ్ గా, అమ్మాయిల వెంటపడే రోమియోగా అఖిల్ అదరగొట్టేశాడు. తాజాగా ఈ చిత్ర కథకు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
షూటింగ్ పూర్తి
మిస్టర్ మజ్ను షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం దర్శకుడు వెంకీ ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.
బూతు సినిమాలో బిగ్ బాస్ భామ.. వైరల్ అవుతున్న దృశ్యాలు!
అఖిల్ లెక్కలేనన్ని సార్లు
అఖిల్ ఫేవరేట్ చిత్రాల జాబితాలో నాగార్జున సినిమాలు తప్పకుండా ఉంటాయి. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం అఖిల్ కు చాలా ఇష్టమట. అఖిల్ సన్నిహితుల నుంచి ఈ వార్తలు బయటకు వచ్చాయి. త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని అఖిల్ లెక్కలేనన్ని సార్లు చూశాడట.
మిస్టర్ మజ్ను కథ
అత్తారింటికి దారేది చిత్రంలో పాత్ర తన స్వభావానికి దగ్గరగా ఉంటుందని అఖిల్ చెబుతుంటాడట. మిస్టర్ మజ్ను చిత్రంలో అత్తారింటికి దారేది ఛాయలు కనిపిస్తాయని కూడా ప్రచారం జరుగుతోంది. కొన్ని సన్నివేశాలని ఆ చిత్రం నుంచి ఇన్స్ పైర్ అయి రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ పోలికలు మాత్రం ఉండవని అంటున్నారు. అదే సమయంలో బాలీవుడ్ హిట్ చిత్రం హే జవానీ హై దివాని కథాంశం కూడా ఈ చిత్రంలో ఉంటుందని అంటున్నారు.
నిధి అగర్వాల్ హీరోయిన్
ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. అఖిల్ తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో మిస్టర్ మజ్ను చిత్రంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ఫస్ట్ లుక్ విడుదలయ్యాక ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.