Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డేంజర్ జోన్ నిర్మాతపై దాడి.. ఒకరి మృతి
డేంజర్ జోన్ సినిమా పంపిణీ హక్కుల విషయంలో చోటుచేసుకొన్న గొడవ ఒకరి హత్యకు దారి తీసింది.
డేంజర్ జోన్ సినిమా పంపిణీ హక్కుల విషయంలో చోటుచేసుకొన్న గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
వివరాల్లోకి వెళితే డేంజర్ జోన్ అనే కన్నడ సినిమాను రాము, స్వరూప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వారిమధ్య ఈ చిత్రానికి సంబంధించిన టెలివిజన్ హక్కులపై వివాదం చోటుచేసుకొన్నది. ఈ నేపథ్యంలో స్వరూప్, రాముల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం స్వరూప్ తన సహచరులతో కలిసి బెంగళూరులోని స్వాగత్ క్యాంప్ లో మద్యం సేవిస్తుండగా రాము వచ్చి వారితో గొడవపడ్డారు.
అనంతరం ఫోన్ చేసి తన అనుచరులను అక్కడికి రప్పించాడు. సంఘటనా స్థలంలో వాగ్వాదం జరిగి పరిస్థితి చేజారింది. రాము అనుచరులు స్వరూప్ బృందంపై దాడి చేశారు. ఆ దాడిలో మనోజ్ అనే వ్యక్తి మృతి చెందగా సహ నిర్మాత స్వరూప్, కమల్, గోపి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారికి స్థానిక హాస్పిటల్లో చికిత్సనందిస్తున్నారు. పరారైన సహ నిర్మాత రాము, అతడి అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.