Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డేంజర్ జోన్ నిర్మాతపై దాడి.. ఒకరి మృతి
డేంజర్ జోన్ సినిమా పంపిణీ హక్కుల విషయంలో చోటుచేసుకొన్న గొడవ ఒకరి హత్యకు దారి తీసింది.
డేంజర్ జోన్ సినిమా పంపిణీ హక్కుల విషయంలో చోటుచేసుకొన్న గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
వివరాల్లోకి వెళితే డేంజర్ జోన్ అనే కన్నడ సినిమాను రాము, స్వరూప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వారిమధ్య ఈ చిత్రానికి సంబంధించిన టెలివిజన్ హక్కులపై వివాదం చోటుచేసుకొన్నది. ఈ నేపథ్యంలో స్వరూప్, రాముల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం స్వరూప్ తన సహచరులతో కలిసి బెంగళూరులోని స్వాగత్ క్యాంప్ లో మద్యం సేవిస్తుండగా రాము వచ్చి వారితో గొడవపడ్డారు.
అనంతరం ఫోన్ చేసి తన అనుచరులను అక్కడికి రప్పించాడు. సంఘటనా స్థలంలో వాగ్వాదం జరిగి పరిస్థితి చేజారింది. రాము అనుచరులు స్వరూప్ బృందంపై దాడి చేశారు. ఆ దాడిలో మనోజ్ అనే వ్యక్తి మృతి చెందగా సహ నిర్మాత స్వరూప్, కమల్, గోపి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారికి స్థానిక హాస్పిటల్లో చికిత్సనందిస్తున్నారు. పరారైన సహ నిర్మాత రాము, అతడి అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.