Don't Miss!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అర్థరాత్రి దాసరి కోడలిపై దాడి.. రచ్చకెక్కిన ఆస్తి వివాదాలు!
Recommended Video
దర్శకరత్న, దాసరి నారాయణ రావు మరణించి ఏడాది పూర్తయింది. అప్పుడే దాసరి కుటుంబంలో చిచ్చు మొదలైంది. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాసరి నారాయణరావు కుమారుడు హరిహర ప్రభుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సుశీల, రెండవ భార్య సుశీల మధ్య ఇప్పుడు ఆస్తి వివాదం తారాస్థాయికి చేరింది.
కర్రతో దాడి
తాను, తన భర్త ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెం 46 లో నివాసం ఉంటున్నామని పద్మ తెలిపింది. కొన్ని రోజుల క్రితం ఆయన మొదటి భార్య సుశీల అర్థరాత్రి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కర్రతో తనపై దాడి చేసిందని పద్మ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
రాత్రి సమయంలో
వీరిద్దరి మధ్య కొంత కాలంగా ఆస్తి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజగా పెద్దదిగా మారిన ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇటీవల రాత్రి సమయంలో సుశీల తన నివాసంలోకి అక్రంగా ప్రవేశించిందని పద్మ ఫిర్యాదులో పేర్కొంది .
మరో మహిళతో
ఆమెతో పాటు సంధ్య అనే మరో మహిళ కూడా వచ్చింది. నీ భర్త ఎక్కడ అని గొడవ పెట్టుకున్నారు. తాను కిచెన్ వైపు వెళుతుండగా కర్రతో నాపై దాడి చేసి గాయపరిచారని పద్మ ఫిర్యాదులో పేర్కొంది.
క్రిమినల్ కేసు
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి వివహరిస్తున్నారు. తన భర్త ఆస్తిలో తనకు కూడా వాటా ఉందని సుశీల వాదిస్తోంది. దాసరి ఉన్నన్ని రోజులు ఎలాంటి గొడవలు లేకుండా ఉన్న వారి కుటుంబంలో ఇప్పుడు చిచ్చు మొదలైంది.