Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అర్థరాత్రి దాసరి కోడలిపై దాడి.. రచ్చకెక్కిన ఆస్తి వివాదాలు!
Recommended Video
దర్శకరత్న, దాసరి నారాయణ రావు మరణించి ఏడాది పూర్తయింది. అప్పుడే దాసరి కుటుంబంలో చిచ్చు మొదలైంది. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాసరి నారాయణరావు కుమారుడు హరిహర ప్రభుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సుశీల, రెండవ భార్య సుశీల మధ్య ఇప్పుడు ఆస్తి వివాదం తారాస్థాయికి చేరింది.
కర్రతో దాడి
తాను, తన భర్త ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెం 46 లో నివాసం ఉంటున్నామని పద్మ తెలిపింది. కొన్ని రోజుల క్రితం ఆయన మొదటి భార్య సుశీల అర్థరాత్రి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కర్రతో తనపై దాడి చేసిందని పద్మ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
రాత్రి సమయంలో
వీరిద్దరి మధ్య కొంత కాలంగా ఆస్తి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజగా పెద్దదిగా మారిన ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇటీవల రాత్రి సమయంలో సుశీల తన నివాసంలోకి అక్రంగా ప్రవేశించిందని పద్మ ఫిర్యాదులో పేర్కొంది .
మరో మహిళతో
ఆమెతో పాటు సంధ్య అనే మరో మహిళ కూడా వచ్చింది. నీ భర్త ఎక్కడ అని గొడవ పెట్టుకున్నారు. తాను కిచెన్ వైపు వెళుతుండగా కర్రతో నాపై దాడి చేసి గాయపరిచారని పద్మ ఫిర్యాదులో పేర్కొంది.
క్రిమినల్ కేసు
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి వివహరిస్తున్నారు. తన భర్త ఆస్తిలో తనకు కూడా వాటా ఉందని సుశీల వాదిస్తోంది. దాసరి ఉన్నన్ని రోజులు ఎలాంటి గొడవలు లేకుండా ఉన్న వారి కుటుంబంలో ఇప్పుడు చిచ్చు మొదలైంది.