Don't Miss!
- Sports DC vs SRH: ట్రావిస్ హెడ్ అన్స్టాపబుల్.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
శ్రియపై దాడి పై ఇండస్ట్రీలో అందరూ..
శనివారం శ్రియపై హైదరాబాద్ లో తెలంగాణా వాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ విషయం ఇప్పుడు తెలుగు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే విషయం చర్చిస్తున్నారు.మరికొందరు శ్రియకు ఫోన్ చేసి పలకరిస్తున్నారు.ఇక ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ కి అయితే ఈ సంఘటన ఓ విధంగా భయం కలిగించింది.అందులోనూ ట్విట్టర్ లో శ్రియ..''జై తెలంగాణ అని చెప్పమని ఒత్తిడి చేశారు.. భయపెట్టారు. చెప్పకపోతే షూటింగ్ సాగనివ్వమని హెచ్చరించారు. పోలీసుల ముందే ఇదంతా జరిగింది. స్వేచ్ఛ ఎక్కడుంది? సేఫ్టీ లేకుండా పోయింది? రాళ్లు విసిరారు.నా కారు అద్దాలు పగలగొట్టారు. నా తల మీద ఒక రాయి పడేది. కానీ దేవుడి దయ వల్ల నాకేం కాలేదు. నేను భారతదేశంలో పుట్టాను. నా స్వేచ్ఛ నాకుంటుంది. నా సేఫ్టీ చూసుకునే హక్కు నాకుంది""అంటూ అవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఇదే మ్యాటర్ ని చాలా మంది చర్చిస్తున్నారు.ఆదివారం కావటంతో షూటింగ్ లు లేక ఇళ్ల దగ్గర ఉన్న సినిమా వారు ఫోన్ ల్లో ఈ విషయాన్ని కనుక్కుంటున్నారు.ఇక తదుపరి శ్రియ హైదరాబాద్ లో షూటింగ్ అంటే పాల్గొంటుందా..మిగతా షూటింగ్ కంప్లీట్ చేస్తుందా అనే అనుమానాలు సైతం అందరిలో మొదలయ్యాయి.అల్లరి నరేష్,శర్వానంద్,శ్రీయ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది.ఈ చిత్రానికి నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం:నారాయణ.