twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రియపై దాడి పై ఇండస్ట్రీలో అందరూ..

    By Srikanya
    |

    శనివారం శ్రియపై హైదరాబాద్ లో తెలంగాణా వాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ విషయం ఇప్పుడు తెలుగు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే విషయం చర్చిస్తున్నారు.మరికొందరు శ్రియకు ఫోన్ చేసి పలకరిస్తున్నారు.ఇక ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ కి అయితే ఈ సంఘటన ఓ విధంగా భయం కలిగించింది.అందులోనూ ట్విట్టర్ లో శ్రియ..''జై తెలంగాణ అని చెప్పమని ఒత్తిడి చేశారు.. భయపెట్టారు. చెప్పకపోతే షూటింగ్ సాగనివ్వమని హెచ్చరించారు. పోలీసుల ముందే ఇదంతా జరిగింది. స్వేచ్ఛ ఎక్కడుంది? సేఫ్టీ లేకుండా పోయింది? రాళ్లు విసిరారు.నా కారు అద్దాలు పగలగొట్టారు. నా తల మీద ఒక రాయి పడేది. కానీ దేవుడి దయ వల్ల నాకేం కాలేదు. నేను భారతదేశంలో పుట్టాను. నా స్వేచ్ఛ నాకుంటుంది. నా సేఫ్టీ చూసుకునే హక్కు నాకుంది""అంటూ అవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఇదే మ్యాటర్ ని చాలా మంది చర్చిస్తున్నారు.ఆదివారం కావటంతో షూటింగ్ లు లేక ఇళ్ల దగ్గర ఉన్న సినిమా వారు ఫోన్ ల్లో ఈ విషయాన్ని కనుక్కుంటున్నారు.ఇక తదుపరి శ్రియ హైదరాబాద్ లో షూటింగ్ అంటే పాల్గొంటుందా..మిగతా షూటింగ్ కంప్లీట్ చేస్తుందా అనే అనుమానాలు సైతం అందరిలో మొదలయ్యాయి.అల్లరి నరేష్,శర్వానంద్,శ్రీయ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది.ఈ చిత్రానికి నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:నారాయణ.

    English summary
    ”Thank god the stone didn’t hit me. Both the windows are broken. Seriously! I’m disgusted I’m born in India and I deserve my freedom and safety is my right!”--Sheriya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X