Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
AD: ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ ఎవరికీ అందడేమో?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం రికార్డు కలెక్షన్లతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. రూ. 100 కోట్ల దిశగా దూసుకెలుతున్న ఈచిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ రేంజి ఏమిటో నిరూపిస్తోంది. రాముడు చెబితే తప్ప హనుమంతుని శక్తి ఏమిటో బయట పడలేదు అనే చందంగా.....పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా వచ్చే దాకా తెలుగు సినిమా మార్కెట్ పరిధి రేంజి ఇంత స్థాయిలో ఉందనేది తెలియలేదు అని అంటున్నారు అభిమానులు.
తాజాగా అత్తారింటికి దారేది చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో సరికొత్త బెంచ్ మార్కును అందుకుంది. ఈచిత్రం ఓవర్స్ వసూళ్లలో రూ. 20 కోట్లను అధిగమించింది. ఒక్క అమెరికాలోనే ఈచిత్రం రూ. 14 కోట్లుకు పైగా వసూలు చేసింది. యూకె. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్ లాంటి దేశాల్లో మొత్తం కలిపి రూ. 6 కోట్లకు పైగా రాబట్టింది.
ఈచిత్రాన్ని ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న 'మైత్రి' మూవీస్ సంస్థ వసూళ్ల విషయాలను అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ సినిమా వసూళ్లతో టాలీవుడ్ నిర్మాతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఒక మంచి సినిమా తీస్తే 100 కోట్లను అందుకోవచ్చే విషయం రుజువవుతోంది.
కాగా...సినిమాలో కొన్ని అదనపు సీన్లు కలుపుతున్నట్లు ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ వియాషన్ని ప్రొడక్షన్ టీం అఫీషియల్గా ప్రకటించింది. అదనంగా 6 నిమిషాల నిడివిగల సీన్లు కలుపుతున్నట్లు వెల్లడించారు. అభిమానులకు దీపావళి కానుకగా ఈ సీన్ కలిపినట్లు చెబుతున్న నిర్మాతలు.....అక్టోబర్ 31 నుంచి సినిమాలో ఆ అదనపు సీన్లు కనిపిస్తాయని తెలిపారు.
పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.
నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.