twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అత్తారింటికి దారేది’ సరికొత్త రికార్డు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: విడుదలకు ముందే శాటిలైట్స్ రైట్స్, ఇతర విషయాల్లో పలు రికార్డులను నెలకొల్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల తర్వాత కూడా రికార్డులు బద్దలు కొట్టడం మొదలు పెట్టింది. విడుదలైన తర్వాత ఈ చిత్రం నెలకొల్పిన తొలి కార్డు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ రికార్డు.

    తొలిరోజు ఈచిత్రం ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో వివిధ స్ర్కీన్లలో 48 సార్లు ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఒకే రోజు ఇన్ని స్క్రీన్లలో ప్రదర్శించలేదని....తెలుస్తోంది. మరో వైపు సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పరిస్థితి చూస్తుంటే సినిమా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

    వాస్తవానికి ఈచిత్రం అక్టోబర్ 9న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే నిన్న ఈ చిత్రం ఇంటర్నెట్లో లీక్ అవడంతో....త్వరగా విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు.

    పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    
 Attarintiki Daredi movie screened for 48 times in one day at the different screens at Prasad’s IMAX. The film directed by Trivikram Srinivas starring Pawan Kalyan and Samantha in lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X