Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కూతుర్లే సుప్రీమ్, తేల్చి చెప్పిన మెగాస్టార్
హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కొడుకుల కంటే కూతుర్లే స్పెషల్ అని పేర్కొన్నారు. అంతే కాదు....కుటుంబం మొత్తానికి వారు ఆత్మలాంటి వారు అని ప్రశంసించారు. కుటుంబ సంబంధ విషయాల్లో వారి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. కూతుర్లు కుటుంబానికి సుప్రీం లాంటి వారు అని పేర్కొన్నారు.
అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే....
ప్రస్తుతం అమితాబ్ మూడు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఆర్ బాల్కీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న చిత్రం ‘షమితాబ్'. అమితాబ్ బచ్చన్, ధనుష్, అక్షర హాసన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అమితాబ్ నటిస్తున్న మరో చిత్రం ‘పికు'. ఈ చిత్రానికి సూజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు. రోన్నిలహిరి నిర్మాత. అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్, ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ రెండు చిత్రాలతో పాటు అమితాబ్ బచ్చన్ ‘వాజిర్' అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. బిజయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్, అదిథి రావు హైదరి ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.