Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'ఆటోనగర్ సూర్య' విడుదల తేదీ(అఫీషియల్)
హైదరాబాద్: నాగచైతన్య హీరోగా రూపొందిన చిత్రం 'ఆటోనగర్ సూర్య'. సమంత హీరోయిన్. దేవా కట్టా దర్శకుడు. అచ్చిరెడ్డి నిర్మాత. ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడా అని అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యలో ఫైనాన్సియల్ సమస్యలతో ఆగి మళ్లీ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అచ్చిరెడ్డి ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.
నిర్మాత మాట్లాడుతూ ''నాగచైతన్య పాత్ర ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అనూప్ చక్కటి స్వరాలందించారు. పాటల్ని త్వరలో విడుదల చేస్తాం''అన్నారు. "ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుతున్నాం. నాగచైతన్య కెరీర్లో ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్టవుతుంది. అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అనూప్ రూబెన్స్ చాలా చక్కని స్వరాలు కూర్చారు. అలాగే రీరికార్డింగ్ చాలా బాగా చేస్తున్నారు. జనవరి 18న వైభవంగా ఆడియో వేడుక జరుపుతున్నాం. ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా సినిమా వచ్చింది'' అని చెప్పారు. '
దర్శకుడు మాట్లాడుతూ ''సమాజంలో చెడుని అంతం చేయాలి అని అందరూ అంటుంటారు. కానీ ముందుకు రారు. అలా వచ్చిన యువకుడి జీవితమే మా సినిమా'' అన్నారు.ఆటోనగర్ ప్రాంతంలో అతడు ఏం చెప్తే అది జరగాల్సిందే.. కారణం అతడంటే భయం కాదు. ఆ యువకుడి మాటపై గురి అలాంటిది. పేదల పక్షాన నిలబడి ఎవరినైనా... ఎంతటి వారినైనా ఎదిరించే ఆ కుర్రాడి కథే మా సినిమా అంటున్నారు.
. 'ఏం మాయ చేశావే' వంటి హిట్ సినిమా తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ఇదే. కిమాయా, బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాశ్రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.