పార్ట్-2: ‘అవును’ సీక్వెల్ ...(థియేట్రికల్ ట్రైలర్)
హైదరాబాద్: రవిబాబు తెరకెక్కించిన ‘అవును' చిత్రం అప్పట్లో మంచి ఫలితాలు రాబట్టింది. దానికి దానికి సీక్వెల్ ‘అవును-2' రాబోతోంది. సీక్వెల్ అంటే ఏదో టైటిల్ మాత్రమే వాడుకోవడం కాదు. ఆ సినిమా ఎక్కడ ఆగిందో అక్కడి నుండి మొదలు కాబోతోంది. హర్షవర్థన్రాణే, పూర్ణ హీరో హీరోయిన్లు. రవిబాబు ఆయన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.
డి.రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ప్లాయింగ్ ఫ్రాగ్స్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేసారు. సెల్కాన్ ఎండీ మురళీకృష్ణ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. అవును సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుందన్నారు దర్శకుడు రవిబాబు.

హర్షవర్దన్ రాణె, పూర్ణతో పాటు ముగ్గురు కొత్త నటులను పరిచం చేస్తున్నాం. సెల్ కాన్ కంపెనీ ట్యాబ్ సినిమాలో వాడాము. సినిమాలో దానికి ప్రత్యేకత ఉంటుంది. కేవలం భయపెట్టాలనే కాన్సెప్టునే నమ్ముకోకుండా ఎంటర్ట్మెంట్ కూడా జోడించి ఈ సినిమా ప్లాన్ చేసామని దర్శకుడు రవిబాబు తెలిపారు. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సురేష్ బాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











