Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పార్ట్-2: ‘అవును’ సీక్వెల్ ...(థియేట్రికల్ ట్రైలర్)
హైదరాబాద్: రవిబాబు తెరకెక్కించిన ‘అవును' చిత్రం అప్పట్లో మంచి ఫలితాలు రాబట్టింది. దానికి దానికి సీక్వెల్ ‘అవును-2' రాబోతోంది. సీక్వెల్ అంటే ఏదో టైటిల్ మాత్రమే వాడుకోవడం కాదు. ఆ సినిమా ఎక్కడ ఆగిందో అక్కడి నుండి మొదలు కాబోతోంది. హర్షవర్థన్రాణే, పూర్ణ హీరో హీరోయిన్లు. రవిబాబు ఆయన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.
డి.రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ప్లాయింగ్ ఫ్రాగ్స్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేసారు. సెల్కాన్ ఎండీ మురళీకృష్ణ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. అవును సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుందన్నారు దర్శకుడు రవిబాబు.
హర్షవర్దన్ రాణె, పూర్ణతో పాటు ముగ్గురు కొత్త నటులను పరిచం చేస్తున్నాం. సెల్ కాన్ కంపెనీ ట్యాబ్ సినిమాలో వాడాము. సినిమాలో దానికి ప్రత్యేకత ఉంటుంది. కేవలం భయపెట్టాలనే కాన్సెప్టునే నమ్ముకోకుండా ఎంటర్ట్మెంట్ కూడా జోడించి ఈ సినిమా ప్లాన్ చేసామని దర్శకుడు రవిబాబు తెలిపారు. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సురేష్ బాబు తెలిపారు.