Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలీవుడ్ ప్రముఖుల ర్యాలీ: షారుక్ ఖాన్కు వ్యతిరేకమా?
హైదరాబాద్: దేశంలో అసహనం పెరిగిపోతోందని ఆరోపిస్తూ అవార్డులు తిరిగిస్తోన్న వారికి వ్యతిరేకంగా బాలీవుడ్ ప్రముఖులు ర్యాలీ నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఈ నెల ఏడున రాష్ట్రపతి భవన్కు ర్యాలీగా వెళ్లాలని సినిమా కళాకారులు, దర్శకులు, నిపుణులు నిర్ణయించారు.
దేశంలో ఆందోళన పడాల్సినంత పరిస్థితేమీ లేదని అనుపమ్ ఖేర్, మధుర్ భండార్కర్, రవీనాటాండన్ అభిప్రాయపడ్డారు. అవార్డులు తిరిగి ఇవ్వడం ఆయా సంస్థలను అవమానించడమేనని వారు అభిప్రాయపడ్డారు. అవార్డులు తిరిగి ఇస్తున్న వారు అందుకు చెబుతున్న కారణాలు వింటుంటే నవ్వు వస్తోందని చెప్పారు. అవార్డులు తిరిగి ఇస్తున్న వారు దేశంలో ఇంతకన్నా అసహనం ఎక్కువున్న సమయంలో ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ర్యాలీలో తాము కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు.
ఇటీవల
ఇంటర్వ్యూలో
షారుక్
ఇలా....
దేశంలో
పెరిగిపోతున్న
మత
అసహనం
మనల్ని
చీకటి
యుగానికి
తీసుకెళుతుందని
బాలీవుడ్
బాద్షా
షారుక్
ఖాన్
ఇటీవల
తన
50వ
పుట్టినరోజు
సందర్భంగా
ఎన్డీటీవీ,
ఇండియా
టుడే
చానెళ్లకు
ఇచ్చిన
ఇంటర్వ్యూలో
చెప్పుకొచ్చారు.
అసహన
వాతావరణానికి
నిరసనగా
రచయితలు,
శాస్త్రవేత్తలు
అవార్డులు
వెనక్కి
ఇస్తుండటంపై
స్పందిస్తూ..
తాను
కూడా
పద్మశ్రీ
అవార్డును
వెనక్కి
ఇచ్చేందుకు
వెనకాడనని,
అయితే,
అలా
చేయాల్సిన
అవసరం
లేదన్నారు.
దేశంలో తీవ్ర అసహనం ఉంది. ఇలా అసహనం ప్రదర్శించడం మూర్ఖత్వం. ఇది చాలా పెద్ద సమస్య. దేశభక్తి పేరుతో మత అసహనం, లౌకికవాదిగా ఉండకపోవడం అనేది నీచమైన నేరం. అసహనం ఏ రూపంలో ఉన్నా అది చెడ్డది. అది మనల్ని చీకటి యుగాలకు తీసుకెళుతుంది. మీరు ఒకవేళ దేశభక్తులైతే.. కొన్ని ప్రాంతాలు, మతాలను మాత్రమే కాదు.. దేశం మొత్తాన్నీ ప్రేమించాలి. అసహనాన్ని నిరసిస్తూ అవార్డులు వెనక్కి ఇచ్చేవారిని గౌరవిస్తున్నాను. కానీ నేను అలా చేయాల్సిన అవసరం లేదు. మాంసం తినే అలవాట్లను బట్టి మతాన్ని నిర్వచించరాదు. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నేనూ మాట్లాడొచ్చు. కానీ జనం నా ఇంటి ముందుకు వచ్చి రాళ్లేస్తారు'' అని షారుక్ తన జన్మదిన సందేశంలో చెప్పారు.