Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరోయిన్ జెనీలియా రీ ఎంట్రీ ఇస్తోంది...
హైదరాబాద్: ఒకప్పుడు కుర్రకారు మదిని దోచుకున్న నటి జెనీలియా డిసౌజా ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పదేళ్ళ ప్రణయం తర్వాత జెనీలియా, రితేష్ దేశ్ముఖ్లు 2012లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పేరు రియాన్ దేశ్ముఖ్.
బిడ్డ పుట్టినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న జెనీలియా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమని ప్రకటించింది. జెనీలియా ఎక్కువ పాపులర్ అయింది సౌత్ లోనే. ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే బాలీవుడ్లో మాత్రం ఆమెకు కలిసి రాలేదు. మరి ఆమె రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది? అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమెను బాలీవుడ్లో హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు మాత్రం లేదు. ఒక బిడ్డకు తల్లి కాబట్టి ఇంటికి దూరంగా ఉంటూ సౌత్ లో కూడా దాదాపుగా నటించే అవకాశం లేదు. తన భర్త రితేష్ దేశ్ ముఖ్ నిర్మించే సినిమాల్లో ఆమె నటించే అవకాశం ఉందని అంటున్నారు. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఇతర బేనర్లలో కూడా నటించేందుకు సిద్ధంగా ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.