Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
హీరోయిన్ జెనీలియా రీ ఎంట్రీ ఇస్తోంది...
హైదరాబాద్: ఒకప్పుడు కుర్రకారు మదిని దోచుకున్న నటి జెనీలియా డిసౌజా ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పదేళ్ళ ప్రణయం తర్వాత జెనీలియా, రితేష్ దేశ్ముఖ్లు 2012లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పేరు రియాన్ దేశ్ముఖ్.
బిడ్డ పుట్టినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న జెనీలియా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమని ప్రకటించింది. జెనీలియా ఎక్కువ పాపులర్ అయింది సౌత్ లోనే. ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే బాలీవుడ్లో మాత్రం ఆమెకు కలిసి రాలేదు. మరి ఆమె రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది? అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమెను బాలీవుడ్లో హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు మాత్రం లేదు. ఒక బిడ్డకు తల్లి కాబట్టి ఇంటికి దూరంగా ఉంటూ సౌత్ లో కూడా దాదాపుగా నటించే అవకాశం లేదు. తన భర్త రితేష్ దేశ్ ముఖ్ నిర్మించే సినిమాల్లో ఆమె నటించే అవకాశం ఉందని అంటున్నారు. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఇతర బేనర్లలో కూడా నటించేందుకు సిద్ధంగా ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.