twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏప్రిల్‌ 15నుంచి గోపీచంద్ కొత్త చిత్రం..

    By Srikanya
    |

    Gopichand
    హైదరాబాద్ : గోపీచంద్ కొత్త చిత్రం కమిటయ్యారు. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఏప్రియల్ 15నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. యాక్షన్‌ కథాంశాల్లో ఒదిగిపోయే కథానాయకుడు గోపీచంద్‌. ఆయన శైలి మాస్‌ ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. అదే తరహాలో చిత్రాల్ని రూపొందించే దర్శకుడు బి.గోపాల్‌. వీరిద్దరి కలయికలో జయబాలాజీ రియల్‌ మీడియా ప్రై.లి.సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. నయనతార కథానాయిక. తాండ్ర రమేష్‌ నిర్మాత.

    ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''యాక్షన్‌, వినోదం మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్‌ ఈసారి గోపీచంద్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం తయారవుతుంది. ఏకధాటిగా టాకీపార్ట్ పూర్తి చేస్తాం. పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తాం. ఇతర నటీనటులు సాంకేతిక బృందం వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాము''అన్నారు.

    ప్రస్తుతం గోపీచంద్‌ ప్రస్తుతం 'జాక్‌పాట్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరవాత నటించే చిత్రానికి బి.గోపాల్‌ దర్శకత్వం వహిస్తారని సమాచారం. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

    నిజానికి 2010లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉంది. అప్పుడే మస్కా రైటర్ చెప్పిన కథని బి.గోపాల్ ఓకే చేసి గోపీచంద్ తో సినిమా అనుకునన్నారు. అప్పట్లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ కాంబినేషన్ తెరకెక్కుతుందని తెలుస్తోంది.

    తెలుగులో అగ్రహీరోలందరితో పనిచేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడుతోంది. గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు.

    English summary
    B Gopal is now all set to cast actor Gopichand in his next film. Nayantara will be the leading lady in the film. Thandra Ramesh will produce the film under the banner of Balaji Real Media Pvt Ltd. It is a high budget film to be directed by B Gopal, the actress Nayanthara and Gopichand will share screen for the first time together. The first shooting schedule of the film will begin from April 15 2013, and the songs will be shot overseas" said the producer of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X