‘బాద్షా’ ఎఫెక్ట్: ట్విట్టర్లో చేరిన శ్రీనువైట్ల
అయితే టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన శ్రీను వైట్ల మాత్రం ఇప్పటి వరకు ట్విట్టర్లో చేరలేదు. అయితే ఆయన భార్య రూప వైట్ల మాత్రం ఎప్పుడో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి అందరితో టచ్ లో ఉంటోంది. దర్శకుడిగా తనకు ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల అవసరం ఎంతో ఉందని చాలా ఆలస్యంగా గ్రహించిన శ్రీను వైట్ల 'బాద్ షా' సినిమా విడుదల సందర్భంగా ఈ రోజు ట్విట్టర్లో ఖాతా తెరిచారు.
గురువారం ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగా అప్పుడే ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 3,200 చేరుకోవడంతో పాటు..... శర వేగంగా ఆ సంఖ్య పెరుగుతూ వెలుతోంది. "What better occasion to join Twitter than the release of 'Baadshah'. Thank you all for the warm welcome." అంటూ శ్రీను వైట్ల తొలి ట్వీట్ చేసారు.
ఈ రోజు విడుదలైన 'బాద్ షా' చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు హిట్ టాక్ రావడంతో...సినిమాను విజయ వంతం చేసిన ప్రేక్షకులకు, సక్సెస్ లో భాగస్వాములైన యూనిట్ సభ్యులకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా థాంక్స్ చెప్పారు.


Click it and Unblock the Notifications












