Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాహుబలి పార్ట్-2 గురించి వెల్లడించిన రాజమౌళి
హైదరాబాద్: ‘బాహుబలి' చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని ‘బాహుబలి ది బిగినింగ్' పేరుతో విడుదల చేయబోతున్నారు. కొన్ని నెలల గ్యాప్ తర్వాత బాహుబలి పార్ట్-2 విడుదల చేయనున్నారు. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ‘బాహుబలి పార్ట్-2' కు సంబంధించిన విషయాలు వెల్లడించారు రాజమౌళి.
‘బాహుబలి' పార్ట్-1 షూటింగ్ పూర్తయిందని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. సినిమా నిడివి 2.32 నిమిషాలు ఉంటుందని రాజమౌళి స్పష్టం చేసారు. అదే విధంగా బాహుబలి పార్ట్-2 షూటింగ్ 70 శాతం పూర్తయిందని తెలిపారు. సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికి రాజమౌళి థాంక్స్ తెలిపారు.
ఈ నెల 31న బాహుబలి ఆడియో వేడుక చేయాలనుకున్నామని, అయితే సెక్యూరిటీ కారణాల వల్ల పోలీసుల నుండి అనుమతి లభించలేదు. అందుకే ఆడియో వేడుక వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా జరిగినందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను అని తెలిపారు.
బాహుబలి ఆడియో వేడుక మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలోనే వెల్లడిస్తాం. అంత వరకు అభిమానులు కాస్త ఓపిక పట్టాలి అని నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు.