Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాహుబలి నిర్మాతల బిగ్ ప్లాన్... ఈ దర్శకుడితోనా?
బాహుబలి, బాహుబలి 2 చిత్రాలను ఆర్కా మీడియా సంస్థపై నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ ప్రాజెక్టు ద్వారా భారీ లాభాలు ఆర్జించారు. సాధారణంగా అయితే ఇలాంటి హిట్స్ పడితే నిర్మాతలు వెంట వెంటనే సినిమాలు కమిట్ అవుతూ ఉంటారు. అయితే ఆర్కా మీడియా వారు మాత్రం ఆచితూచి ముందుకు సాగుతున్నారు.
బాహుబలి ప్రాజెక్ట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో కోట్లు ఖర్చుచేసి వేసిన భారీ సెట్స్ వృద్ధా పోనివ్వకుండా పెట్టిన పెట్టుబడికి ప్రతి పైసా తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వారు ఆన్లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ఫాం నెట్ఫ్లిక్స్తో టై అప్ అయ్యి ఇదే సెట్లో 'బాహుబలి-బిఫోర్ ది బిగినింగ్' పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు క్రిష్తో నెక్ట్స్ ప్రాజెక్ట్
బాహుబలి నిర్మాతలు త్వరలో మరో భారీ మూవీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఇది ఉంటుందని టాక్. అయితే ఇది రెగ్యులర్ మూవీ ప్రాజెక్ట్ కాదని, బాహుబలి లాగా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడికానున్నాయి.
ఎన్టీఆర్-మహానాయకుడుతో బిజీ బిజీ
దర్శకుడు క్రిష్ ప్రస్తుతం ‘ఎన్టీఆర్-మహానాయకుడు' ప్రాజెక్టుతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కాబోతోంది. ఈ మూవీ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుని తన తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెడతారట.
సొంతబేనర్లో క్రిష్ మూవీ
‘బాహుబలి' నిర్మాతలతో సినిమా చేయడానికి ముందే క్రిష్ తన సొంత బేనర్ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్ష్' పతాకంపై ఓ మూవీ చేస్తారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఎవరితో? చేయబోతున్నారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.
ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు పాపం..
దర్శకుడు క్రిష్కు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. బాలీవుడ్ మూవీ ‘మణికర్ణిక' నుంచి మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. నిర్మాతగా చేసిన ‘అంతరిక్షం' నష్టాలను మిగిల్చింది. ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘కథానాయకుడు'కు మంచి పేరు వచ్చినా నష్టాలపాలైన సంగతి తెలిసిందే. మరి రేపు విడుదల కాబోతున్న ‘మహానాయకుడు' ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.