Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాహుబలి నిర్మాతల బిగ్ ప్లాన్... ఈ దర్శకుడితోనా?
బాహుబలి, బాహుబలి 2 చిత్రాలను ఆర్కా మీడియా సంస్థపై నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ ప్రాజెక్టు ద్వారా భారీ లాభాలు ఆర్జించారు. సాధారణంగా అయితే ఇలాంటి హిట్స్ పడితే నిర్మాతలు వెంట వెంటనే సినిమాలు కమిట్ అవుతూ ఉంటారు. అయితే ఆర్కా మీడియా వారు మాత్రం ఆచితూచి ముందుకు సాగుతున్నారు.
బాహుబలి ప్రాజెక్ట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో కోట్లు ఖర్చుచేసి వేసిన భారీ సెట్స్ వృద్ధా పోనివ్వకుండా పెట్టిన పెట్టుబడికి ప్రతి పైసా తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వారు ఆన్లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ఫాం నెట్ఫ్లిక్స్తో టై అప్ అయ్యి ఇదే సెట్లో 'బాహుబలి-బిఫోర్ ది బిగినింగ్' పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు క్రిష్తో నెక్ట్స్ ప్రాజెక్ట్
బాహుబలి నిర్మాతలు త్వరలో మరో భారీ మూవీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఇది ఉంటుందని టాక్. అయితే ఇది రెగ్యులర్ మూవీ ప్రాజెక్ట్ కాదని, బాహుబలి లాగా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడికానున్నాయి.
ఎన్టీఆర్-మహానాయకుడుతో బిజీ బిజీ
దర్శకుడు క్రిష్ ప్రస్తుతం ‘ఎన్టీఆర్-మహానాయకుడు' ప్రాజెక్టుతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కాబోతోంది. ఈ మూవీ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుని తన తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెడతారట.
సొంతబేనర్లో క్రిష్ మూవీ
‘బాహుబలి' నిర్మాతలతో సినిమా చేయడానికి ముందే క్రిష్ తన సొంత బేనర్ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్ష్' పతాకంపై ఓ మూవీ చేస్తారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఎవరితో? చేయబోతున్నారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.
ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు పాపం..
దర్శకుడు క్రిష్కు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. బాలీవుడ్ మూవీ ‘మణికర్ణిక' నుంచి మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. నిర్మాతగా చేసిన ‘అంతరిక్షం' నష్టాలను మిగిల్చింది. ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘కథానాయకుడు'కు మంచి పేరు వచ్చినా నష్టాలపాలైన సంగతి తెలిసిందే. మరి రేపు విడుదల కాబోతున్న ‘మహానాయకుడు' ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.