twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్-రాజమౌళి ‘బహుబలి’ ఏప్రిల్ 15 నుంచి...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మగధీర తర్వాత ఆ రేంజిలో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా బహుబలి. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రీప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

    ఈచిత్రంలో ప్రభాస్-రాణా మధ్య మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. సత్యరాజ్, అనుష్క ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరుకుంది.

    ఈ చిత్రాన్ని దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఆర్కా మీడియా బేనర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి సమర్పకులు.

    ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే ఓ వండర్ గా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు.

    English summary
    Rajamouli and Prabhas are coming together for the film Baahubali which will hit the floors from April 15. This film is period drama and trilingual expected to release in Telugu, Tamil and Hindi and this film also features Rana Daggubati, Sathyaraj and Anushka.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X