Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'బాహుబలి' వరస్ట్ సినిమా..అవార్డ్ ఎలా ఇస్తారు? డైరక్టర్ సీరియస్
ముంబై: ఓ ప్రక్క.. జాతీయ ఉత్తమ చిత్రంగా 'బాహుబలి' ఎంపికవ్వడం పట్ల సర్వత్రా ప్రశంసలు వినిపిస్తూంటే...అక్కడక్కడా , విమర్శలు సైతం వస్తున్నాయి. ముఖ్యంగా.. పంజాబీ దర్శకుడు గురువిందర్ సింగ్ అవార్డుల ఎంపికపట్ల, బాహుబలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రం ఏమిటంటే ఆయనకు సైతం నేషనల్ అవార్డ్ రావటం.
గురువిందర్ సింగ్ మాట్లాడుతూ... "అన్ని ప్రధానమైన అవార్డులు ..కమర్షియల్ చిత్రాలకే వెళ్లిపోయాయి. బాహుబలి పూర్తి గా క్రాప్. దానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఇచ్చారు. ఇది నేషనల్ అవార్డ్ కాదు..బిజిపి అవార్డ్ ," అని ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పందించారు.
ఈ అవార్డుల ప్రకటనే ఒక పెద్ద జోక్ అని దర్శకుడు విమర్శించాడు. కాగా గురువిందర్ సింగ్ తీసిన 'చౌత్తీకూట్' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. మరోవైపు గురువిందర్సింగ్ చేసిన కామెంట్స్ ను చాలా మంది సమర్థిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ రావటం గమనార్హం.
'బాహుబలి ఖచ్చితంగా చాలా గొప్ప చిత్రమే. హాలీవుడ్ స్థాయిని మన భారతీయ సినిమాలు అందుకుంటాయని నిరూపించిన మూవీ ఇది. కానీ సన్నివేశాల చిత్రీకరణలో అదేవిధంగా నటీ నటుల ప్రతిభను తెరకెక్కించడంలో ఉద్వేగాలను చిత్రీకరించడంలో 'బాజీరావ్ మస్తానీకే' ఎక్కువ మార్కులు పడ్డాయి' అని వివరణ ఇచ్చాడు కౌషిక్.
అదే విధంగా 'బాహుబలి' సినిమా విషయంలో జాతీయ అవార్డుల ప్యానల్ అన్యాయం చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో 600 కోట్ల కలక్షన్స్ ను వసూలు చేసిన 'బాహుబలి' సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డును ఇచ్చి సరిపెట్టడమే కాకుండా ఈ సినిమాలో కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్ మాత్రమే బాగున్నాయి అన్న సంకేతాలు వచ్చే విధంగా ఈసినిమాకు జాతీయ స్థాయి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు ఇచ్చారు.
ముగ్గురు జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ఎంపిక చేశారు. ఈసారి డిజిటల్ రూపంలో ఎంట్రీలు వచ్చాయి. ఫీచర్ కేటగిరీలో 29 భాషల్లో 308 సినిమాలు ఎంట్రీ వచ్చాయి. మొత్తం రెండు నెలల పాటు సెలక్షన్ ప్రక్రియ కొనసాగినట్లు సభ్యులు తెలిపారు. అవార్డులు ప్రకటించిన వాళ్లలో ఫిల్మ్ బోర్డుకు చెందిన గంగమరియన్, సంజీవ్దత్తా, జాన్, ధరమ్ గులాటీ, జాన్ సహాయ్, ఎస్ఆర్ లీలా, శ్రీకే వాసు, సతీశ్ కౌశిక్ ఉన్నారు.