Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మేము సైతం: ‘బాహుబలి’ టీం అందుకే డుమ్మా!
హైదరాబాద్: హుదూధ్ తుఫాన్ బాధితుల సహాయార్థం టాలీవుడ్ అంతా కలిసి నిర్వహించిన ‘మేము సైతం' కార్యక్రమానికి ‘బాహుబలి' చిత్ర యూనిట్ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. అయితే వారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేక పోయినా వారు చేసిన స్కిట్ వీడియో రూపంలో ప్రదర్శించారు. అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ స్కిట్ ఉంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి' అందుబాటులో లేక పోవడంతో రాలేక పోయారని తెలుస్తోంది. బాహుబలి చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం బల్గేరియా వెళ్లింది. అదన్నమాట సంగతి. ఆర్కా మీడియా బేనర్లో ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో ‘బాహుబలి' చిత్రం తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడమే లక్ష్యంగా టీం మొత్తం కష్టపడి పని చేస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఈ చిత్రం తెలుగు ప్రాంతానికో, ఇండియాకో పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగిన విధంగానే చిత్రీకరణ జరుగుతోంది.