Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కేసీఆర్ బయోపిక్: బాహుబలి రచయితతో సంప్రదింపులు
ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే ఏపీ మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ మీద బయోపిక్స్ మొదలయ్యాయి. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా బయోపిక్ రాబోతోందట.
ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం... లక్ష్మణ్ కొంతం నిర్మాణంలో ఇ.నివాస్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారట. కేసీఆర్ను తెలంగాణ జాతి పితగా చూపిస్తూ ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా విషయంలో బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ అయింది. దర్శక నిర్మాతలు ఇటీవలే ఆయన్ను సంప్రదించారని, కేసీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను సినిమా రూపంలోకి మలచాలని కోరారట. విజయేంద్ర ప్రసాద్ ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
కాగా... తెలుగు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి కూడా గతేడాది కేసీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో కేసీఆర్ పాత్రలో రాజ్ కుమార్ రావు లేదా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇంకా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కక ముందే కేసీఆర్ మీద ఇపుడు మరో బయోపిక్ తెరపైకి రావడం గమనార్హం.