twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరును పరామర్శించిన బాబు దంపతులు

    By Staff
    |

    తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం చిరంజీవిని కలిశారు. చిరంజీవి నివాసంలో చంద్రబాబు నాయుడు సుమారు రెండు గంటలపాటు గడిపినట్టు సమాచారం. రెండవ కుమార్తె శ్రీజ రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్న తరువాత చిరంజీవి షాక్ గురయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు దంపతులు చిరంజీవిని కలిసి మాట్లాడినట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు వెల్లడించాయి. చిరంజీవి భార్య సురేఖ, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి మంచి స్నేహితులని అందుకే వెళ్లినట్టు ఆ వర్గాలు తెలిపాయి. చిరంజీవి దంపతులతో మాట్లాడిన చంద్రబాబు దంపతులు తాము ఈ విషయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.
    Read more about: chiranjeevi chandrababu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X