టీడీపి వారే ముంచారు: బాబుమోహన్

ఎన్నికల్లో చాలా మంది తెదేపా నాయకులు కష్టపడి పనిచేశారని, అయితే కొందరు మాత్రం కాంగ్రెస్ కు అమ్ముడు పోగా, ఇంకొందరు ప్రచారం చేయక స్తబ్దంగా ఉండగా, మరికొందరు నిద్రపోయారని విమర్శించారు. కాంగ్రెస్ కు ఏఏ విధాలుగా సహాయ సహకారాలందించారో, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు, రశీదులతో సహ తన వద్ద ఉన్నాయన్నారు. అతి త్వరలో వీటిని ప్రజల ఎదుట బహిర్గతం చేస్తానన్నారు.
తాను విపరీతంగా నమ్మిన కొందరు నేతలు తాము ఎన్నికల ప్రచారం చేయకుండానే చేసినట్టు, అంతటా మెజార్టీ తమకే ఉన్నదని తనకు తప్పుడు సంకేతాలిచ్చారన్నారు. గల్లీ స్థాయికి కూడా పనికి రాని కొందరిని తాను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదగనిస్తే, వారేమో ఆ కృతజ్ఞతా భావం లేకుండా తనను మోసం చేశారని ఆరోపించారు. మరో పెద్ద మనిషికి ఆర్థిక బాధ్యతలనప్పగిస్తే తప్పుడు లెక్కలను చూపడమే గాక, కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా సహకారమందించారని ఆరోపించారు.


Click it and Unblock the Notifications











