Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
టీడీపి వారే ముంచారు: బాబుమోహన్
ఎన్నికల్లో చాలా మంది తెదేపా నాయకులు కష్టపడి పనిచేశారని, అయితే కొందరు మాత్రం కాంగ్రెస్ కు అమ్ముడు పోగా, ఇంకొందరు ప్రచారం చేయక స్తబ్దంగా ఉండగా, మరికొందరు నిద్రపోయారని విమర్శించారు. కాంగ్రెస్ కు ఏఏ విధాలుగా సహాయ సహకారాలందించారో, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు, రశీదులతో సహ తన వద్ద ఉన్నాయన్నారు. అతి త్వరలో వీటిని ప్రజల ఎదుట బహిర్గతం చేస్తానన్నారు.
తాను విపరీతంగా నమ్మిన కొందరు నేతలు తాము ఎన్నికల ప్రచారం చేయకుండానే చేసినట్టు, అంతటా మెజార్టీ తమకే ఉన్నదని తనకు తప్పుడు సంకేతాలిచ్చారన్నారు. గల్లీ స్థాయికి కూడా పనికి రాని కొందరిని తాను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదగనిస్తే, వారేమో ఆ కృతజ్ఞతా భావం లేకుండా తనను మోసం చేశారని ఆరోపించారు. మరో పెద్ద మనిషికి ఆర్థిక బాధ్యతలనప్పగిస్తే తప్పుడు లెక్కలను చూపడమే గాక, కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా సహకారమందించారని ఆరోపించారు.