Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చావటానికైనా సిధ్దమే:బాబు మోహన్ కన్నీరు
ఆ థియేటర్లన్నీ ఇండస్ట్రీలోని ఇద్దరు ముగ్గురు చేతుల్లో వున్నాయి. అదొక మాఫియాలాగా తయారైంది. దిక్కులేని వాణ్ణి చంపడానికి ఇండస్ట్రీలో దావూద్ ఇబ్రహీంలు వున్నారు. వీళ్లకు గుణపాఠం చెప్పేది ఎవరు? నైజాంలో మా సినిమాను పంపిణీ చేస్తానని శంకర్ (జ్యోతి ఫిల్మ్ ఫ్యాక్టరీ) వస్తే సరేనన్నా. అతను అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. హైదరాబాద్లో 7 ప్రింట్లతో రిలీజ్చేసి, రెండో వారంలో 6 ప్రింట్లను ఇంట్లో పెట్టుకున్నాడు. 50 రోజులు ఆడిస్తానని చెప్పి, రెండోవారానికే థియేటర్ల నుంచి తీసేశాడు. నేను డబ్బులు కట్టి ఆడిస్తానన్నా వినలేదు. నా నియోజకవర్గ కేంద్రం జోగిపేటలో రెండు మూడు రోజుల ఆడించి తీసేశాడు. బ్రహ్మాండంగా ఆడుతున్న థియేటర్ల నుంచి కూడా ప్రింట్లు వెనుకకు తీసుకొస్తున్నాడు.
నా ప్రింట్లను నాకిచ్చేస్తే ఆడించుకుంటానంటే మనిషి దొరకడం లేదు. ఈ విషయంపై నిర్మాతల మండలినీ, ఫిల్మ్ చాంబర్నీ సంప్రదించా. వాళ్లేమీ చేయలేమంటున్నారు. మండలి కనీసం ఫిర్యాదును కూడా తీసుకోలేదు. మండలి వున్నది నిర్మాతల సమస్యల్ని పరిష్కరించడానికి కాదా? చాంబర్ వాళ్లు చర్చిద్దాం రమ్మంటే వెళ్లా. పది నిమిషాల ఆలస్యమైంది. అక్కడ ఎవరూ లేరు. 'ఏంటి నీ బాధ' అని అడిగిన వాళ్లులేరు. ఇంత దుఃఖాన్నీ, ఆవేదననూ నేనెప్పుడూ అనుభవించలేదు. ఆ డిస్ట్రిబ్యూటర్ వెనుక కొంతమంది వుండి ఇదంతా చేయిస్తున్నారు. నా ప్రింట్లు నాకు రాకపోతే రెండు రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తా. అప్పుడు ఆ నరరూప రాక్షసుల పేర్లు బయటపెడతా. చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటా. న్యాయం కోసం పోరాటంలో చావుకైనా సిద్ధమే. నాలాగే చాలామంది చిన్న నిర్మాతలు కష్టాలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రంలో ఇలాంటి దుస్థితి వుండటం దురదృష్టకరం. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'' అన్నారు.