'బద్రీనాథ్'రీ సెన్సార్... మండిపడుతున్న అల్లు అరవింద్
అల్లు అర్జున్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రెడీ అయిన 'బద్రీనాథ్'కి శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.మూడు కట్స్ తో 'ఏ' సర్టిఫికేట్ ప్రధానం చేసారు.అయితే కొందరు సబ్యులు మాత్రం రీ సెన్సార్ చెయ్యాలని,సెంకండాఫ్ లో హింస మరీ ఎక్కువగా ఉందని చెప్తున్నారుట.దాంతో సోమవారం మరో సారి సెన్సార్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే అల్లు అరవింద్ మాత్రం రీ సెన్సార్ కి ఒప్పుకోవటం లేదని వినికిడి.తాను రిలీజ్ డేట్ ని పదవ తేదీగా ప్రకటించుకున్నానని,ఇప్పుడు రీ సెన్సార్ అంటే ప్రింట్లు వేసి డిస్పాచ్ చేయటం కష్టమని మండిపడుతున్నారుట.ఇక తమన్నా తో చేసిన కొన్ని హాట్ సీన్స్ కు సైతం వేటు వేయ్యాలని డిసైడ్ అయ్యారని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది.ఈ మధ్య కాలంలో ఏ చిత్రానికీ రీ సెన్సార్ సమస్య ఎదురుకాలేదు.


Click it and Unblock the Notifications











