Don't Miss!
- News లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజమౌళి ‘బహుబలి’తో రిస్క్ చేస్తున్నాడా? ఇదిగో కారణాలు!
హైదరాబాద్: మగధీర, ఈగ చిత్రం తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ 'బహుబలి'. ఆ రెండు చిత్రాలను మించిన బడ్జెట్ తో తెలుగు సినిమా చరిత్రలోనే కనివినీ ఎరగని రీతిలో ఏకంగా దాదాపు రూ. 100 కోట్లతో ఈచిత్రాన్ని ప్లాన్ చేసారు రాజమౌళి. ప్రభాస్, అనుష్క హీరో హీరోయిన్లు కాగా దగ్గుబాటి రాణా ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నారు.
రాజమౌళి తప్ప మరే తెలుగు దర్శకుడైనా ఇదే ప్రతిపాదన తెస్తే నిర్మాతలు ఎవరూ ముందుకు వచ్చే వారు కాదు. కేవలం రాజమౌళిపై నమ్మకంతోనే నిర్మాతలు కూడా ఇంత భారీ బడ్జెట్ పెట్టేందుకు సాహసం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలేవీ ప్లాపైన దాఖలాలే లేవు. 2009లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' చిత్రం ఆ కాలంలోనే దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. మరో వైపు గత సంవత్సరం అసలు హీరోనే లేకుండా రూపొందించిన గ్రాఫికల్ వండర్ 'ఈగ' చిత్రం కూడా రూ. 60 కోట్ల పైనే మార్కెట్ చేసింది.
రాజమౌళిపై అటు నిర్మాతలకు, ఇటు ప్రేక్షకులకు ఎంత నమ్మకం ఉన్నన్నపటికీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రం 'బహుబలి' ప్రాజెక్ట్ విషయంలో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయని, 100 కోట్ల బడ్జెట్ అంటే మాటలు కాదని, రాజమౌళి భారీ అంచనాలతో రిస్క్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది ఫిల్మ్ నగర్లో....
'బహుబలి' సినిమాను తెలుగు, హిందీ, తమిళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూడు భాషల్లో కలిసి పెట్టిన పెట్టుబడి 100 కోట్లు తిరిగొస్తాయా? అంటే అనుమానమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రభాస్ సినిమాలకు 30 నుంచి 35 కోట్లకు మించి మార్కెట్ లేదు. పైగా ప్రభాస్ స్టార్ ఇమేజ్ తెలుగుకు మాత్రమే పరిమితం. రాజమౌళి ఈగ చిత్రం హిందీ వెర్షన్ పెద్దగా వర్కౌట్ కాలేదు. తమిళంలో కూడా రాజమౌళి, ప్రభాస్ ప్రభావం అంతంత మాత్రమే. స్టార్ ఇమేజ్, దర్శకుడి మార్కుతో సంబంధం లేకుండా సినిమా ప్రేక్షక రంజకంగా ఉండి భారీ విజయం సాధిస్తే తప్ప రాజమౌళి అంచనాలు నిజమయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియాపై రాఘవేంద్రరావు, శోభు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ పని చేయబోతున్నారు.