Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరో వివాదంలో బాహుబలి: దండెత్తుతున్న మాలలు
హైదరాబాద్: బాహుబలి చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంపై మాలలు అభ్యతరం వ్యక్తం చేశారు. తాజాగా లీకైన బాహుబలి చిత్ర దృశ్యాల్లో మాలలను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సీసీఎస్లో మాలల సంక్షేమసంఘం ఫిర్యాదు చేసింది.
అయితే ఆసన్నివేశాలని పైరసీకి పాల్పడిన వారు సృష్టించారా? లేక చిత్రంలోనే అలా ఉన్నాయా అనే విషయంపై విచారణ చేస్తామని సీసీఎస్ పోలీసులు తెలిపారు. విడుదలకు ముందే సంచలనాలకు కారణమైన బాహుబలి చిత్రం విడుదలైన తర్వాత పరిస్థితి ఏమిటనేది సందేహంగా ఉంది.
విడుదలకు ముందే 'బాహుబలి' చిత్రంలోని దృశ్యాలు గతంలో లీకైన విషయం తెలిసిందే. దీని వెనుక చాలా తతంగం నడిచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఐదారునెలల నుంచి ఈ దృశ్యాలను ల్యాబ్ నుంచి బయటకు తీసుకురావాలని సెంట్రల్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న వర్మతో పాటు మరో ఇద్దరు ప్రయత్నించినట్లు ఆధారాలు లభించాయి. ఆ ఇద్దరిని పట్టుకునేందుకు డీసీపీ(నేరాలు) రవివర్మ ప్రత్యేక బృందాన్నినియమించారు.
'బాహుబలి'కి మరింత హంగులు తీసుకొచ్చే నేపథ్యంలో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పోరాట దృశ్యాలను ఆకర్షణీయంగా చిత్రీకరించాలని మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థకు గత ఏడాది ఆగస్టులో అప్పగించారు. మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలో ఐటీ మేనేజర్గా పనిచేస్తున్న బివీవీఎల్ఎన్ వర్మపై అప్పటికే ఆరోపణలు రావడంతో విధుల నుంచి తొలగించారు.'
దీంతో వర్మ తన సంస్థకు ఏదైనా నష్టం చేయాలన్న కసితో అప్పుడప్పుడూ వస్తుండేవాడు. పాత ఉద్యోగి కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. గత ఏడాది అక్టోబరులో వర్మ తన ల్యాప్ట్యాప్లో 12 నిమిషాల నిడివి ఉన్న బాహుబలి చిత్ర దృశ్యాలను తస్కరించాడు. అనంతరం సొంతూరికి వెళ్లి అక్కడ ఇద్దరు, ముగ్గురితో విషయం చర్చించాడు.
వీటిని అంతర్జాలంలో ఉంచితే సినిమా అపజయం పాలవుతుందని చెప్పగా... ఓ పథకం రూపొందించారు. ల్యాప్టాప్లో ఉన్న పోరాట దృశ్యాలను మరో సీడీలోకి మార్చి ల్యాప్ట్యాప్లో దృశ్యాలను తొలగించారు. సంక్రాంతి సందర్భంగా ఈ వీడియోను అప్లోడ్ చేయాలని నిర్ణయించారు. కుదరకపోవడంతో జనవరి 23న యూట్యూబ్, ఫేస్బుక్లలో ఉంచారు.