Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భయపెట్టేందుకు సిద్దమైన బాహుబలి టీమ్.. నెవర్ బిఫోర్ అనేలా..
టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచం ముందు నిలబెట్టిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా వరల్డ్ వైడ్ గా పవర్ఫుల్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ రానా వంటి వారి స్టార్ డమ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. అయితే చిత్ర యూనిట్ కష్టంలో నిర్మాతల కృషి కూడా ఎంతో ఉంది.
కేవలం డబ్బులు పెట్టినంత మాత్రానా సినిమా సక్సెస్ ఫుల్ గా ఫినిష్ అవ్వదు. కంటెంట్ ఎంత బావున్నా కూడా తెలివిగా రిలీజ్ చేయగలిగితేనే బాక్సాఫీస్ వద్ద ప్రాఫిట్స్ అందుతాయి. ఇక బాహుబలి నిర్మాతలు ప్రసాద్, శోభు కూడా అదే తరహాలో ఆలోచించి సినిమాను విడుదల చేశారు. ఇక ఆ సినిమా తరువాత ఈ స్టార్ ప్రొడ్యూసర్స్ మరో పెద్ద సినిమాను టచ్ చేయలేదు.
ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ తో కలిసి బాహుబలి వెబ్ సిరీస్ ను ట్రై చేశారు గాని వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ఒక హారర్ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఆ కాన్సెప్ట్ తప్పకుండా వర్కౌట్ అవుతుందని బడ్జెట్ కూడా గట్టిగానే పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇక మరోవైపు రెజీనా నాలుగు తమిళ్ సినిమాలతో పాటు ఒక ద్విభాషా చిత్రంతో బిజీగా ఉంది. అలాగే ఆచార్య సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించనుంది.