కాటి కాపరి నా మీద కేసు పెట్టాడు...దర్శకుడు బాలా
ఒక కాటి కాపరి నా మీద కేసు పెట్టాడు. ఈ కధ నాది అని. నా సినిమాలో కధ లేదు. ఇది ఓ క్యారెక్టర్ మాత్రమె అని చెప్పాను అంటున్నారు బాలా. అలాగే ఆర్తిస్టులో శారీరక లోపం ఉంటేనే కధ పండుతుంది అంటూ వివరించారు ప్రముఖ దర్శకుడు బాలా. ఆయన రీసెంట్ గా రూపొందించిన వాడు వీడు చిత్రం విడదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించారు. ఇక వాడు వీడు చిత్రం గురించి చెబుతూ...ఈ సినిమాలో నేటివిటిని ప్రతిబింబించే డైలాగులు వున్నాయి..సినిమా అందరికీ బాగా నచ్చింది. ఇది అవార్డుల కోసం తీసిన సినిమా కాదు. విశాల ఆర్య ల కోసం తీసిన సినిమా. అయితే విశాల్ కు అవార్డు వస్తుందని అనుకుంటున్నాను. నా సినిమాలు అన్ని రకాల ప్రేక్షకులు ఆదరిస్తారు.ఆర్టిస్టులను దృష్టిలో పెట్టుకుని నేను సినిమాలు చేస్తాను. నా సినిమాల్లో కధలు వుండవు అన్నారు. జి.కే.ఫిలిం కార్పోరేషన్ పతాకంపై రూపొందిన 'వాడు-వీడు' సినిమా విజయోత్సవ సభ సినీమ్యాక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో విక్రమ్, విశాల్, ఆర్య, బాల, మధు శాలిని, నిల్సన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











