త్రిషతో జతకడుతున్న బాలయ్య
నందమూరి అగ్రహీరో బాలయ్య చెన్నయ్ చిన్నది త్రిష తో జతకట్టబోతున్నాడు. బిగోపాల్ దర్శకత్వంలో రాబోతోన్న తన తర్వాతి సినిమా హర హర మహదేవ సినిమాకు గాను త్రిష బాలయ్య సరసన బుక్కయింది. గతంలో టాలీవుడ్ అగ్రహీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో కలిసి నటించినా....బాలయ్యతో నటించే అవకాశం మాత్రం త్రిషకు దక్కలేదు. ఎట్టకేలకు ఇద్దరి కాంబినేషన్ కుదిరింది.
శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్ ప్రత్యేకంగా బాలయ్య కోసం హర హర మహదేవ కథను తయారు చేశారు. బాలయ్య ఇటీవలే శ్రీరామరాజ్యం సినిమాను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల అనంతరం హరహర మహదేవ మూవీ సెట్స్ పైకి రానుంది.


Click it and Unblock the Notifications











