Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బోయపాటితో చేస్తున్న చిత్రం కథ గురించి బాలకృష్ణ
అలాగే ఇక నుంచి రాజకీయ రంగంలో చురుకుగా పాలు పంచుకుంటానని, తెలుగుదేశం క్రియాశీల రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని దీని వల్ల తన నట జీవితానికి ఏ విధమైన ఆటంకం ఏర్పడదని, నటుడిగా కొనసాగుతానని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. డల్లాస్ నగరంలో నిర్వహిస్తున్న నాట్స్ సంబరాల్లో భాగంగా ప్రవాసాంధ్రులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడారు.
ఇక తన కుమారుడు మోక్షజ్ఞ బి.బి.ఎం. చదువుతున్నాడని, నాలుగేళ్ల వరకు చదువులో కొనసాగుతాడని, ఆసక్తిని బట్టి తన భవిష్యత్తు తానే నిర్ణయించుకుంటాడని బాలకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి అవుతారా అని అడిగిన ప్రశ్నకు దీని గురించి ఏమీ ఆలోచించలేదన్నారు. తెదేపాని అధికారంలోకి తీసుకురావడమే తన ధ్యేయమన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని ప్రవాసాంధ్ర మహిళ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ చిరునవ్వే సమాధానమైంది.
ఎన్టీఆర్ జ్ఞాపకాలతో నేటి యువతరానికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందిస్తున్నామని తెలిపారు. నటి సౌందర్య మృతితో నర్తనశాల చిత్రీకరణ నిలిచిపోయిందని, అర్జునుడు, బృహన్నల, కీచకుడి పాత్రల్లో త్రిపాత్రాభినయం చేయాలన్న తన కోరిక కలగానే మిగిలిపోయిందని బాలకృష్ణ అన్నారు. ద్రౌపది పాత్రకు తగిన నటి కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు.