Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలకృష్ణ ముఖ్య అతిధిగా భరణి 'వెండి తెర వెండి పండగ'
త్వరలో తెలుగు చిత్ర సీమలో 'వెండి తెర వెండి పండగ' పంక్షన్ జరగనుంది. ఈ కార్యక్రమం నిర్వహించటానికి కారణం నటుడు, రచయిత తణికెళ్ళ భరణి పరిశ్రమలోకి ప్రవేశించి పాతిక సంవత్సరాలు కావటమే. ఈ(నవంబర్) నెల 17న నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బాలకృష్ణ అతిథులుగా హాజరవుతారు. ఈ వేదికపైనే భరణి రచించిన 'నక్షత్రదర్శనమ్' అనే కవితా సంపుటిని ప్రకాష్ రాజ్ విడుదల చేయబోతున్నారు.మొదటి కాపీని బ్రహ్మానందం అందుకుంటారు. ఈ కాలంలో దాదాపు 500 చిత్రాల్లో నటించి, 50 పైచిలుకు చిత్రాలకు మాటలు అందించారు. అలాగే కీ, సిరా, ది లాస్ట్ ఫార్మర్ వంటి కొన్ని అర్ధవంతమైన షార్ట్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించారు. ఇక ఈ పంక్షన్ ని సంగమ్ అకాడమి వారు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించబోతున్నారు.
నవంబర్ 17వ తేదీ సాయింత్రం ఆరు గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ పంక్షన్ కి రామ్ గోపాల్ వర్మ, కె రాఘవేంద్రరావు, నాజర్, సిసి రెడ్డి వంటి విఐపిలు హాజరుకానున్నారు. తణికెళ్ళ భరణి..పాలకొల్లలో జన్మించి 1984లో కంచుకవచం చిత్రంతో సినీ రంగ ప్రవేశం మాటల రచయితగా దాదాపు యాభై చిత్రాల వరకూ చేసారు. అలాగే మూడు వందల చిత్రాల వరకూ రకరకాల పాత్రల్లో నటించారు. 1999లో సముద్రం చిత్రానికి కాను నంది అవార్డు ని పొందారు. అదే రోజున ఆయన ఈ పాతికేళ్ళ సిని ప్రస్దానం పురస్కరించుకుని ఓ సావనీర్ ని సైతం విడుదల చేస్తున్నారు. ఈ బహుముఖ కోవిదనుడుకి ఈ సందర్భంగా ధట్స్ తెలుగు కూడా తణికెళ్ళ భరణి గారికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది.